తండ్రి వెనుకే ఫాలో అయిన కొడుకు.. చివరికి చేసింది ఇదే!!

మేడ్చల్ జిల్లాలో కన్న కొడుకే తండ్రిని నడిరోడ్డుపై హత్య చేసిన ఘటన కలకలం రేపింది.

By Medi Samrat  Published on  22 Feb 2025 7:45 PM IST
తండ్రి వెనుకే ఫాలో అయిన కొడుకు.. చివరికి చేసింది ఇదే!!

మేడ్చల్ జిల్లాలో కన్న కొడుకే తండ్రిని నడిరోడ్డుపై హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఈ దారుణ ఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సికింద్రాబాద్‌లోని లాలాపేటకు చెందిన 45 ఏళ్ల మొగిలిని అతని తనయుడు సాయికుమార్ హత్య చేశాడు. తండ్రీకొడుకులు ప్యాకర్స్ అండ్ మూవర్స్‌లో పని చేస్తున్నారు. మొగిలి నిత్యం మద్యం తాగి ఇంట్లో గొడవ చేస్తుండటంతో కొడుకు హత్య చేసినట్లు చెప్పారు. శనివారం మధ్యాహ్నం లాలాపేట నుండి మొగిలి బస్సులో బయలుదేరగా, కొడుకు ద్విచక్ర వాహనంపై వెంట నడిచాడు. ఈసీఐఎల్ బస్ స్టాండ్ వద్దకు రాగానే తండ్రి మొగిలి బస్సు దిగాడు. వెంట తెచ్చుకున్న చాకుతో విచక్షణారహితంగా పొడిచాడు. తీవ్రంగా గాయపడిన మొగిలిని స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Next Story