ఇంటి నిండా రక్తం.. నలుగురు పిల్లలను కిరాత‌కంగా హ‌త‌మార్చిన‌ తండ్రి

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి నలుగురు చిన్నారులను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు.

By Medi Samrat
Published on : 27 March 2025 11:46 AM IST

ఇంటి నిండా రక్తం.. నలుగురు పిల్లలను కిరాత‌కంగా హ‌త‌మార్చిన‌ తండ్రి

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి నలుగురు చిన్నారులను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. మృతి చెందిన చిన్నారులలో 13, తొమ్మిది, ఏడేళ్ల బాలికలు, ఐదేళ్ల బాలుడు ఉన్నారు. సంచలనం సృష్టించిన ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఘటనా స్థలం దగ్గర పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో ఈ దారుణ హత్యకు గల కారణాలు కూడా వెల్లడయ్యాయి. సమాచారం ప్రకారం.. షాజహాన్‌పూర్‌లో ఒక యువకుడు తన నలుగురు పిల్లలను పదునైన ఆయుధంతో గొంతులు కోసి చంపి.. అనంతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

రాజీవ్ కతేరియా (36) తన భార్య కాంతి దేవి, కుమార్తెలు స్మృతి (13), కీర్తి (9), ప్రగతి (ఏడు), కుమారుడు రిషబ్ (ఐదు)తో కలిసి రోజా పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్‌పూర్ చాచారి గ్రామంలో నివసించేవారు.

కాంతిదేవి బుధవారం కార్టోలి గ్రామంలోని తన తల్లి ఇంటికి వెళ్లింది. రాజీవ్ భార్య కాంతి అలియాస్ కౌశల్య తల్లి ఇల్లు ఫతేగంజ్ ఈస్ట్ పోలీస్ స్టేషన్ కర్తౌలి గ్రామంలో ఉంది. రాజీవ్‌తో పాటు నలుగురు పిల్లలూ ఇంట్లోనే ఉన్నారు. రాజీవ్ ఇంటి పక్కనే ఉంటున్న అతని తండ్రి పృథ్వీరాజ్ గురువారం ఉదయం టీ తాగేందుకు మనవడిని పిలిచినా లోపలి నుంచి ఎలాంటి శబ్దం రాలేదు. ఎంతసేపటికి పిలిచినా ఎవరూ బయటకు రాకపోవడంతో ఇంట్లో చూశారు. లోపల దృశ్యం చూసి పృథ్వీరాజ్ కేకలు వేశాడు. లోపల రక్తం మ‌డుగు ఉంది. మంచం కూడా రక్తంతో తడిసింది. పదునైన ఆయుధాలతో నలుగురు చిన్నారుల గొంతు కోసిన‌ట్లు తెలుస్తుంది.

లోపల రాజీవ్ చీరతో ఉరివేసుకున్నాడు. పృథ్వీరాజ్ కేకలు విని గ్రామస్తులు గుమిగూడారు. సమాచారం అందుకున్న ఎస్పీ రాజేష్ ద్వివేది పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యువకుడు మానసికంగా కుంగిపోయినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

ఏడాది క్రితం రాజీవ్‌కు ప్రమాదం జరిగిందని తండ్రి పృథ్వీరాజ్ చెప్పాడు. అప్పటి నుంచి మానసికంగా కుంగిపోయాడు. కొన్నిసార్లు అతను చాలా హైప‌ర్‌గా ఉండేవాడు. కోపంతో ఊగిపోయేవాడని చెప్పాడు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ రాజీవ్ ద్వివేది తెలిపారు. ప్రాథమికంగా చూస్తే ఆ యువకుడు మానసిక ఒత్తిడికి లోనైనట్లు తెలుస్తోందన్నారు.

ఏడాది క్రితం రాజీవ్, అతని భార్య కౌసల్య అలియాస్ కాంతి బైక్‌పై గ్రామానికి వస్తుండ‌గా భవల్‌ఖేడ సీహెచ్‌సీ సమీపంలో బైక్‌ ట్రాలీని ఢీకొట్టింది. తలకు గాయమైన తర్వాత రాజీవ్ వింతగా ప్ర‌వ‌ర్తించేవాడు. తనలో తానే మాట్లాడుకునేవాడు. ఎలాంటి కారణం లేకుండా గొడవలు పడేవాడ‌ని పృథ్వీరాజ్ పేర్కొన్నాడు.

Next Story