కల్వర్టును ఢీకొట్టిన‌ బస్సు.. 10 మంది మృతి, 36 మందికి గాయాలు

రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం బస్సు ఫ్లైఓవర్ గోడను ఢీకొనడంతో పది మంది మృతి చెందగా.. 36 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు

By -  Medi Samrat
Published on : 29 Oct 2024 6:10 PM IST

కల్వర్టును ఢీకొట్టిన‌ బస్సు.. 10 మంది మృతి, 36 మందికి గాయాలు

రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం బస్సు ఫ్లైఓవర్ గోడను ఢీకొనడంతో పది మంది మృతి చెందగా.. 36 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ప్ర‌మాదంపై పోలీసులు ఈ సమాచారం ఇచ్చారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ భువన్ భూషణ్ యాదవ్ మాట్లాడుతూ.. సలాసర్ నుండి లక్ష్మణ్‌గఢ్‌కు వస్తున్న ప్రైవేట్ బస్సు టర్న్ తీసుకుంటుండగా లక్ష్మణ్‌గఢ్‌లోని ఫ్లైఓవర్‌లోని కొంత భాగాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందగా.. 36 మందికి పైగా గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం లక్ష్మణ్‌గఢ్‌, సికార్‌లోని ఆసుపత్రులకు తరలించినట్లు ఆయన తెలిపారు.


Next Story