ఘరానా దొంగ అరెస్ట్‌.. భారీగా బంగారం, వెండి స్వాధీనం

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

By Medi Samrat
Published on : 29 May 2025 8:14 PM IST

ఘరానా దొంగ అరెస్ట్‌.. భారీగా బంగారం, వెండి స్వాధీనం

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనేక ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడిన మహబూబ్‌నగర్‌కు చెందిన 27 ఏళ్ల వ్యక్తిని పహాడిషరీఫ్ పోలీసులు అరెస్టు చేశారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అంబర్ పేట్ నివాసి అల్లం శివ వద్ద నుంచి 13 తులాల బంగారు ఆభరణాలు, 41 తులాల వెండి, రూ.50,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో నమోదైన ఏడు చోరీ కేసులతో అల్లం శివకు సంబంధం ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శివ రాత్రిపూట ఇళ్లను లక్ష్యంగా చేసుకుని విలువైన వస్తువులతో పారిపోయాడు. నిందితుడిని గతంలో ఇలాంటి తొమ్మిది కేసుల్లో అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత, అతను నగరంలో నేర కార్యకలాపాలు ప్రారంభించాడు.

Next Story