పెళ్లింట విషాదం.. ఇవాళ నవ వధువు మృతి.. నిన్న వరుడు మృతి.!
New bride dies today while receiving treatment .. Groom died yesterday. పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి. నిండు నూరేళ్లు కలిసి జీవించాలని కలలుగన్న ఆ పెళ్లి జంటకు ఆయువు అప్పుడే నిండిపోయింది.
By అంజి Published on
25 Nov 2021 9:45 AM GMT

పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి. నిండు నూరేళ్లు కలిసి జీవించాలని కలలుగన్న ఆ పెళ్లి జంటకు ఆయువు అప్పుడే నిండిపోయింది. ఎన్నో కలలతో పెళ్లి బంధంలోకి అడుగు పెట్టిన వారికి ఆ పెళ్లి వేడుకే చివరిది అయ్యింది. నవ వధువు ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో వరుడు మృతి చెందాడు. అదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నవ వధువు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూసింది. దీంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్లోని శేరిలింగంపల్లికి చెందిన శ్రీనివాసులకు, తమిళనాడు రాష్ట్రానికి చెందిన యువతి కనిమొళితో పెళ్లి జరిగింది.
వీరి వివాహం తిరుపతిలో వైభవంగా జరిగింది. పెద్దల సమక్షంలో ఒక్కటైన ఈ కొత్త పెళ్లి జంట.. వధువు ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘోర ప్రమాదంలో వరుడు శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా వధువు కనిమొళి తీవ్ర గాయాల పాలై కోమాలోకి వెళ్లింది. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నవ వధువు మృతి చెందింది. పెళ్లై ఒక రోజు గడవక ముందే పెళ్లి కుమారుడు ప్రాణాలు కోల్పోగా.. చికిత్స పొందుతూ పెళ్లి కుమార్తె మృతి చెందింది.
Next Story