ప్రియుడు మర‌ణాన్ని తట్టుకోలేక ప్రియురాలి ఆత్మహత్య

Nellore Crime News. వారిద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.. పెళ్లి చేసుకోవాలని పెద్దలను కూడా ఒప్పించారు

By Medi Samrat  Published on  15 Aug 2021 3:01 PM GMT
ప్రియుడు మర‌ణాన్ని తట్టుకోలేక ప్రియురాలి ఆత్మహత్య
వారిద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.. పెళ్లి చేసుకోవాలని పెద్దలను కూడా ఒప్పించారు. ఉపాధి నిమిత్తం వెళ్లిన ప్రియుడు మృతి చెందడంతో ఆ బాధను తాళ లేక ప్రియురాలు కూడా ఆత్మ హత్య చేసుకున్న సంఘటన ఉండ్రాళ్ల మండలంలోని యల్లాయపాళెం మజరా గ్రామనత్తంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఉండ్రాళ్ల శ్రీకాంత్ (21) , అదే ప్రాంతానికి చెందిన కోరికల సౌమ్య(19) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరువురి కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు.


అయితే.. శ్రీకాంత్ త‌ల్లిదండ్రుల‌కు ముగ్గురు కొడుకులు. శ్రీకాంత్ వారిలో రెండో వాడు కావడంతో పెద్ద కుమారుడికి వివాహం చేశాక వీరికి పెళ్లి చేద్దామని పెద్దలు నిర్ణయించుకున్నారు. ఇంతలో పెను విషాదం చోటుచేసుకుంది. శ్రీకాంత్ ఎలక్ట్రికల్ డెకరేటర్స్ వద్ద పనిచేస్తాడు. అందులో భాగంగా ఆత్మకూరు వద్ద డెకరేషన్స్ పని నిమిత్తం శుక్రవారం వెళ్లి విద్యుత్ షాకకు గురై మృతి చెందాడు. దీంతో మనస్తాపానికి గురైన సౌమ్య శనివారం వేకువజామున 2 గంటల ప్రాంతంలో ఇంట్లో ఉన్న గుళికల మందు తీసుకుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు నార్తురాజుపాళెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఇరువురి కుటుంబాల్లో విషాదం అలుముకుంది.


Next Story