కర్ణాటకలోని మైసూరులో విహారయాత్రకు వెళ్లిన ఓ వ్యక్తి వంతెనపై నుంచి కావేరి నది ప్రవాహాలలో పడిపోయాడు. ఈ విషాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మహేష్ అనే వ్యక్తి ఫోటోను తీసుకోడానికి ప్రయత్నిస్తుండగా.. బ్యాలెన్స్ కోల్పోయి వంతెనపై నుంచి పడిపోయాడు, ఈ వంతెన ఇంకా నిర్మాణంలో ఉంది.
36 ఏళ్ల మహేష్ ఒక ఆటోరిక్షా డ్రైవర్. శ్రీరంగపట్నంలోని కావేరి నదిలో అతను కొట్టుకుపోయాడు. మహేష్ చివరి క్షణాల వీడియోలో అతను వెనక్కి ఓ అడుగు వేయగా, అతను బ్యాలెన్స్ కోల్పోయాడు. వీడియో తీసిన అతని స్నేహితుడు ఏమి జరిగిందో చూసి కేకలు వేశాడు. అగ్నిమాపక శాఖ సిబ్బంది, అత్యవసర బృందాలు అతని కోసం వెతుకుతున్నాయి.