ఒంట‌రి మ‌హిళ‌పై క‌న్నేశాడు.. మత్తుమందుతో ఇంటికెళ్లి తలుపు తట్టాడు..

Man Sexually Abused Woman In Shamshabad. శంషాబాద్ లో అత్యాచార ఘటన కలకలం రేపింది. మత్తు మందు ఇచ్చి

By Medi Samrat  Published on  25 July 2022 11:31 AM GMT
ఒంట‌రి మ‌హిళ‌పై క‌న్నేశాడు.. మత్తుమందుతో ఇంటికెళ్లి తలుపు తట్టాడు..

శంషాబాద్ లో అత్యాచార ఘటన కలకలం రేపింది. మత్తు మందు ఇచ్చి వివాహితపై ఓ ప్రభుత్వ ఉద్యోగి అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా ఉండేందుకు బెదిరింపులకు దిగాడు. ఆమె నగ్న చిత్రాలను ఆమెకే పంపించి, బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చాడు. ఆర్జీఐఏ పోలీసుల కథనం ప్రకారం.. ముడావత్ చందూలాల్ (40) శంషాబాద్ ఉప కేంద్రంలో ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. భర్త చనిపోవడంతో ఓ మహిళ ఉపాధికోసం శంషాబాద్ కు వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది.

ఆమెపై చందూలాల్ కన్నేశాడు. కోరిక తీర్చాలంటూ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. హ్యాండ్ కర్చీఫ్ లో మత్తుమందు పెట్టుకుని ఆమె ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. తలుపులు తీయగానే ఆ కర్చీఫ్ ను ఆమె ముక్కు మీద పెట్టాడంతో ఆ మహిళ సృహ కోల్పోయింది. ఆ తరువాత మహిళపై అత్యాచారం చేశాడు. ఆమె న్యూడ్ ఫోటోలను ఫోన్ లో చిత్రీకరించి, అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత మహిళ నగ్న చిత్రాలను ఆమె ఫోన్ కి పంపించి బెదిరించడం మొదలుపెట్టడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.











Next Story