దారుణం: కేవలం 'సరదా' కోసం.. శరీరంలోకి మలద్వారం ద్వారా గాలి నింపి చంపేశారు.!

man dies after co-workers pump air into him for 'fun'. కేవలం 'సరదా' కోసం ఒక మిల్లులో పనిచేసే కార్మికులు రెహ్మత్ అలీ అనే తోటి ఉద్యోగి శరీరంలోకి అతని మలద్వారం ద్వారా గాలిని పంప్ చేసి మరణించేలా చేశారు.

By అంజి  Published on  27 Nov 2021 4:57 AM GMT
దారుణం: కేవలం సరదా కోసం.. శరీరంలోకి మలద్వారం ద్వారా గాలి నింపి చంపేశారు.!

కేవలం 'సరదా' కోసం ఒక మిల్లులో పనిచేసే కార్మికులు రెహ్మత్ అలీ అనే తోటి ఉద్యోగి శరీరంలోకి అతని మలద్వారం ద్వారా గాలిని పంప్ చేసి మరణించేలా చేశారు. ఈ దారుణ ఘటన పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో జరిగింది. సుమారు 10 రోజుల చికిత్స తర్వాత రెహ్మత్ ఆసుపత్రిలో మరణించాడు. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో ఉన్న నార్త్ బ్రూక్ జూట్ మిల్లులో నవంబర్ 16న ఈ ఘటన జరిగింది. రెహ్మత్ అలీ రాత్రి షిఫ్ట్‌లో ఉండగా, అతని సహోద్యోగులు అతనిని పట్టుకుని, అతని మలద్వారంలోకి పైపుని చొప్పించి, అతని శరీరంలోకి గాలిని పంప్ చేశారు.

ఆ సమయంలో రెహ్మత్ అలీ ప్రతిఘటించాడు, అయినప్పటికీ అతని తోటి ఉద్యోగులు ఆపలేదు. వెంటనే రెహ్మత్ అలీ ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది. ఆ తర్వాత అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతడిని మొదట హుగ్లీలోని చుంచురా ఇమాంబర ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన జరిగిన 10 రోజుల తర్వాత రెహ్మత్ అలీ మరణించాడు. గాలి ఒత్తిడి కారణంగా రెహ్మత్ కాలేయం పూర్తిగా పాడైందని వైద్యులు తెలిపారు.

ఘటన అనంతరం రెహ్మత్ అలీ కుటుంబ సభ్యులు భద్రేశ్వర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో రెహ్మత్ అలీ సహోద్యోగి షాజాదా ఖాన్ ప్రధాన నిందితుడు. మిల్లులో జ్యూట్‌ను ఎయిర్ పంప్‌తో శుభ్రం చేసే బాధ్యత షాజాదాపై ఉంది. రెహ్మత్ కుటుంబానికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే, జూట్ మిల్లు ఈ విషయంపై మౌనం వహిస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story