ఇంటి పైకప్పు మీద.. ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తి అరెస్టు

Man arrested for raping 5-year-old girl on rooftop in Odisha. ఒడిశా రాష్ట్రంలో గల పూరీలోని తన ఇంటి పైకప్పుపై 5 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినందుకు 35 ఏళ్ల వ్యక్తిని పోలీసులు

By అంజి  Published on  27 Jan 2022 1:13 PM GMT
ఇంటి పైకప్పు మీద.. ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తి అరెస్టు

ఒడిశా రాష్ట్రంలో గల పూరీలోని తన ఇంటి పైకప్పుపై 5 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినందుకు 35 ఏళ్ల వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్టు చేసినట్లు సీనియర్ అధికారి తెలిపారు. నిందితుడిని జగత్‌సింగ్‌పూర్‌కు చెందిన మహేశ్‌ మొహంతిగా గుర్తించారు. మొహంతికి నేర చరిత్ర ఉంది. ఇటీవల జైలు నుండి విడుదలయ్యాడు. ఆదివారం జరిగిన ఘటన తర్వాత పరారీలో ఉన్న నిందితుడి కోసం నాలుగు పోలీసు బృందాలు గాలించాయని ఎస్పీ కెవి సింగ్ తెలిపారు. చివరకు జిల్లాలోని ఓ ఇంటి నుంచి అతడిని పట్టుకున్నట్లు సింగ్ తెలిపారు.

నిందితుడు బాలిక కుటుంబానికి పరిచయస్తుడు, బాలికను పైకప్పుపైకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఆమె కేకలు విన్న బాలిక తల్లి పైకప్పుపైకి పరుగెత్తి చూడగా నిందితులు అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. బాలిక పరిస్థితి విషమించడంతో పూరీ జిల్లా ఆసుపత్రిలో చేర్చి, కటక్‌లోని వైద్య సదుపాయానికి తరలించారు. కటక్‌లోని ఎస్‌సిబి మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేరిన ఐదేళ్ల బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. "నిందితుడు జగత్‌సింగ్‌పూర్ జిల్లాకు చెందినవాడు. ఇటీవల జైలు నుండి విడుదలయ్యాడు. అతను అమ్మాయి కుటుంబ సభ్యులకు కూడా తెలుసు'' అని ఎస్పీ తెలిపారు. 20 రోజుల్లోగా చార్జిషీట్ దాఖలు చేస్తామని, రెండు నెలల్లో కోర్టు తీర్పు వెలువడుతుందని, ఈ కేసు 'రెడ్ ఫ్లాగ్' కేటగిరీ కిందకు వస్తుందని సింగ్ చెప్పారు.

Next Story