10 ఏళ్ల చిన్నారిపై రెండేళ్లపాటు లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో 41 ఏళ్ల వ్యక్తికి కేరళలో 142 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. రూ. 5 లక్షల జరిమానా విధిస్తూ కేరళలోని పతనంతిట్టాలోని పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) కోర్టు ఆ వ్యక్తికి శిక్షను విధించింది. నిందితుడు జరిమానా చెల్లించకపోతే, అతను మరో మూడేళ్ల జైలు శిక్ష అనుభవించాలని పేర్కొంది.
ఆనందన్ పీఆర్ అలియాస్ బాబు అనే వ్యక్తి 60 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. మార్చి 20, 2021న, తిరువళ్ల పోలీసులు 2019-2021 మధ్య 10 ఏళ్ల చిన్నారిపై అతడు అత్యాచారం చేశారని గుర్తించారు.ఆ రెండేళ్ల కాలంలో ఆమెపై చాలాసార్లు క్రూరమైన రీతిలో లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అతనిపై కేసు నమోదు చేశారు. బాబు ఆ అమ్మాయికి బంధువు. పిల్లల తల్లిదండ్రులతో కలిసి అదే నివాసంలో ఉండేవాడు. కేసులో సాక్షుల వాంగ్మూలాలు, మెడికల్ రికార్డులు, ఆధారాలు పరిశీలించి అతడికి శిక్ష విధించారు. పోక్సో కింద నమోదైన నేరాలకు సంబంధించి నిందితుడికి మొత్తం 142 ఏళ్ల కఠిన కారాగార శిక్ష.. రూ. 5 లక్షలు జరిమానా విధించినట్లు జిల్లా పోలీసులు తెలిపారు.