11వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారం చేసిన అధ్యాపకుడు

Jodhpur schoolteacher arrested for raping Class-11 student. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 11వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై

By Medi Samrat
Published on : 10 Jan 2022 6:27 PM IST

11వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారం చేసిన అధ్యాపకుడు

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 11వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారం చేసినందుకు అధ్యాపకుడిని అరెస్టు చేశారు. టీచర్‌తో పాటు బాలికపై సామూహిక అత్యాచారం చేసిన ముగ్గురు యువకులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు గత మూడేళ్లుగా తనపై అత్యాచారం చేశాడని, ఆ నేరాన్ని ఎవరికైనా బయటపెడితే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించాడని బాలిక తెలిపింది. ఈ కేసును ఒసియన్ డిప్యూటీ ఎస్పీ నూర్ మహ్మద్ దర్యాప్తు చేస్తున్నారు.

ఫిర్యాదుకు సంబంధించి అమ్మాయి సోదరుడు మాట్లాడుతూ "మా సోదరి పొలంలో సహాయం చేస్తానని చెప్పి ఇంటి నుండి వెళ్లిపోయింది. ఆమె సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో, మేము ఆమె కోసం వెతకడం ప్రారంభించాము. మరుసటి రోజు, నిందితుడైన టీచర్ ఇంటి వద్ద బాత్రూమ్ నుండి ఒక అమ్మాయి అరుపులు ప్రజలు విన్నారని మాకు సమాచారం వచ్చింది. మేము అక్కడికి చేరుకున్నప్పుడు, ఆమె అపస్మారక స్థితిలో పడి ఉంది. మేము ఆమెను ఒసియన్‌ సమీపంలోని ఆసుపత్రికి తరలించాము" అన్నారు.

ఓ కారు డ్రైవర్ తమ వద్దకు వచ్చి రావాలని బెదిరించాడని బాలిక తన కుటుంబ సభ్యులకు చెప్పింది. భయపడి కారులో కూర్చుంది. ఆ తర్వాత ఉపాధ్యాయుడి ఇంటికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసిన వెంటనే ఉపాధ్యాయుడిని అరెస్టు చేసినట్లు మటోరా ఎస్‌హెచ్‌ఓ ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. విచారణ ప్రారంభించబడిందని.. బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేశామన్నారు.


Next Story