హైదరాబాద్‌లో భారీ మోసం..నకిలీ నియామక పత్రాలతో ఐటీ ఉద్యోగాల పేరిట టోకరా

ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి నిరుద్యోగులను మోసం చేసిన వంశీ కుమార్ (30) అనే వ్యక్తిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

By -  Knakam Karthik
Published on : 17 Feb 2026 10:24 AM IST

Hyderabad, Crime News, JobFraud, Cyberabad Police, Fake Appointment Letters, IT Jobs, Employment Scam

హైదరాబాద్‌లో భారీ మోసం..నకిలీ నియామక పత్రాలతో ఐటీ ఉద్యోగాల పేరిట టోకరా

హైదరాబాద్: ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి నిరుద్యోగులను మోసం చేసిన వంశీ కుమార్ (30) అనే వ్యక్తిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. కూకట్‌పల్లికి చెందిన నిందితుడు వంశీ, స్థానిక టీ స్టాళ్లు మరియు టిఫిన్ సెంటర్ల వద్ద ఉండే యువకులను టార్గెట్ చేసేవాడు. తనకు ప్రముఖ ఐటీ సంస్థల HR విభాగాలతో మంచి సంబంధాలు ఉన్నాయని, సులభంగా ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మి పలువురు యువకులు పెద్ద మొత్తంలో నగదు చెల్లించారు.

డబ్బు తీసుకున్న తర్వాత వంశీ బాధితులకు నకిలీ నియామక పత్రాలను అందజేశాడు. ఆ పత్రాలతో యువకులు సంబంధిత కంపెనీలకు వెళ్లగా, అవి నకిలీవని తేలడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Next Story