Breaking : హత్రాస్‌లో తొక్కిసలాట.. 27 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లా సికంద్రరావు పట్టణంలోని ఫుల్రాయ్ గ్రామంలో మంగళవారం పెను ప్రమాదం జరిగింది.

By Medi Samrat  Published on  2 July 2024 11:20 AM GMT
Breaking : హత్రాస్‌లో తొక్కిసలాట.. 27 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లా సికంద్రరావు పట్టణంలోని ఫుల్రాయ్ గ్రామంలో మంగళవారం పెను ప్రమాదం జరిగింది. ఇక్క‌డి భోలే బాబా సత్సంగంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో మహిళలు, చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో ఇప్పటివరకు 27 మంది మరణించినట్లు నివేదించబడింది. మృతుల‌ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులను మెడికల్ కాలేజీ ఎటాకు పంపిన‌ట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంపై సీఎం యోగి కూడా అధికారుల‌ను అల‌ర్ట్ చేసిన‌ట్లు తెలుస్తుంది.

ప్రమాదాన్ని తన కళ్లతో చూసిన ఓ బాలిక మాట్లాడుతూ.. సత్సంగంకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారని చెప్పింది. సత్సంగం ముగిసిన తరువాత.. ప్రజలు అక్కడ నుండి బయలుదేరే తొందరలో తొక్కిసలాట జరిగిందని పేర్కొంది. ప్రజలు ఒకరి మొహాలు మరొకరు చూసుకోలేదు. మహిళలు, పిల్లలు కింద‌ పడుతూనే ఉన్నారు. జనం వారిపైకి పరుగులు తీశారు. రక్షించడానికి ఎవరూ లేరు. ఎక్కడ చూసినా అరుపులు, కేకలు అని వెల్ల‌డించింది.

Next Story