భార్యను చంపిన భ‌ర్త‌.. నాలుగు రోజులు ఇంట్లోనే మృతదేహం

ఘజియాబాద్‌లో తన భార్య గొంతు కోసి, ఆమె మృతదేహాన్ని నాలుగు రోజుల పాటు నివాసంలోనే ఉంచాడు ఆ వ్యక్తి. 55 ఏళ్ల వ్యక్తిని ఆదివారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు

By Medi Samrat  Published on  3 March 2024 2:32 PM GMT
భార్యను చంపిన భ‌ర్త‌.. నాలుగు రోజులు ఇంట్లోనే మృతదేహం

ఘజియాబాద్‌లో తన భార్య గొంతు కోసి, ఆమె మృతదేహాన్ని నాలుగు రోజుల పాటు నివాసంలోనే ఉంచాడు ఆ వ్యక్తి. 55 ఏళ్ల వ్యక్తిని ఆదివారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు భరత్ సింగ్ మద్యం మత్తులో జరిగిన విషయాన్ని ఇరుగుపొరుగు వారితో చెప్పడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. అపార్ట్‌మెంట్‌ నుంచి దుర్వాసన కూడా వస్తుండడంతో అతడు చెప్పింది నిజమేనని నమ్మారు.. ఇంతలో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు శనివారం సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 3 నుంచి 4 రోజుల క్రితమే చంపేసి ఉంటాడని పోలీసులు తెలిపారు. వారి బెడ్‌రూమ్‌లో మహిళ మృతదేహం లభ్యమైంది.

నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకుని విచారించగా ఇంటి గొడవల కారణంగా తన 51 ఏళ్ల భార్య సునీతను హత్య చేసినట్లు అంగీకరించాడు. మహిళ శరీరం కుళ్లిపోయిందని పోలీసులు తెలిపారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మూడు సంవత్సరాల క్రితం సునీతతో తనకు పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత తాము సహజీవనం చేయడం ప్రారంభించామని పోలీసుల విచారణలో భరత్ వెల్లడించాడు. సునీత మొదటి భర్త 2012లో చనిపోగా.. భరత్ విడాకులు తీసుకున్నాడు. ఏడాది క్రితం వీరికి పెళ్లయింది. ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో ఫిబ్రవరి 28న భరత్ మద్యం మత్తులో రెండో భార్యను గొంతుకోసి హత్య చేశాడు. భరత్ ఓ మద్యం దుకాణంలో సేల్స్‌పర్సన్‌గా పనిచేసేవాడు.

Next Story