మహారాష్ట్రలో లోయలో పడ్డ కారు.. నలుగురు తెలంగాణ వాసులు మృతి

మహారాష్ట్రలో ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

By Medi Samrat  Published on  17 Sep 2023 11:02 AM GMT
మహారాష్ట్రలో లోయలో పడ్డ కారు.. నలుగురు తెలంగాణ వాసులు మృతి

మహారాష్ట్రలో ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న ఓ కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో కారులో ప్ర‌యాణిస్తున్న ఎనిమిది మందిలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను తెలంగాణ వాసులుగా గుర్తించారు. టూర్ నిమిత్తం వెళ్లిన వారు మృత్యువాత ప‌డ్డార‌ని అధికారులు తెలిపారు. మృతులు ఆదిలాబాద్, నల్గొండ జిల్లాకు చెందిన వారుగా తెలుస్తోంది.

అమరావతి జిల్లా చికల్దారా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కారులో ఉన్న నలుగురు చనిపోగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయని మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. అయితే, మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రమాదానికి గురైన కారు నెంబర్ ఏపీ 28 డిడబ్ల్యూ 2119 అని పోలీసులు తెలిపారు.

Next Story