ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో నిలిచిపోయిన‌ విద్యుత్ స‌ర‌ఫ‌రా.. నలుగురు శిశువులు మృతి

Four newborn babies die at government hospital in Chhattisgarh's Ambikapur. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని ఒక ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోవ‌డంతో నలుగురు శిశువులు మరణించారు.

By Medi Samrat  Published on  5 Dec 2022 2:45 PM GMT
ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో నిలిచిపోయిన‌ విద్యుత్ స‌ర‌ఫ‌రా.. నలుగురు శిశువులు మృతి

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని ఒక ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోవ‌డంతో నలుగురు శిశువులు మరణించారు. అంబికాపూర్‌లోని గ‌వ‌ర్న‌మెంట్ మెడిక‌ల్ కాలేజీలో న‌లుగురు న‌వ‌జాత శిశువులు మృత్యువాత ప‌డ్డారని అధికారులు తెలిపారు. 4 గంట‌ల పాటు విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోవ‌డంతో చ‌నిపోయిన‌ట్టు డాక్ట‌ర్లు తెలిపారు. శిశువుల ఆరోగ్య ప‌రిస్థితి విష‌య‌మంగా ఉండ‌డంతో స్పెష‌ల్ న్యూ బార్న్ కేర్ యూనిట్‌లో ఉంచారు. వాళ్ల‌లో ఇద్ద‌రికి వెంటిలేట‌ర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే 4 గంట‌ల పాటు విద్యుత్ స‌ర‌ఫ‌రా ఆగిపోవ‌డంతో న‌లుగురు చిన్నారులు చ‌నిపోయారని జిల్లా కలెక్ట‌ర్ కుంద‌న్‌ కుమార్ తెలిపారు.

అయితే విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోవ‌డం వ‌ల్ల ఆ పిల్ల‌లు చ‌నిపోయార‌నే విష‌యాన్ని ఆస్ప‌త్రి సిబ్బంది దాచేయడానికి ప్రయత్నించారు.. ఎప్పుడైతే పిల్లల తల్లిదండ్రులు, కుటుంబ‌స‌భ్యులు ఆందోళ‌న చేపట్టారో.. అప్పుడు అస‌లు విష‌యం చెప్పారు. ఉద‌యం 5:30 నుంచి 8:30 గంట‌ల మ‌ధ్య‌ ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి టీఎస్ సింగ్ డియో తెలిపారు.


Next Story