భార్య, కొడుకు చేతిలో ఇంటిపెద్ద హ‌తం

Drunk man murdered by his wife, 16-year-old son in Pilibhit. ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాలో ఓ వ్యక్తిని అతని భార్య, అతని 16 ఏళ్ల కొడుకు హత్య చేసిన ఘటన

By Medi Samrat  Published on  2 Jan 2023 2:16 PM GMT
భార్య, కొడుకు చేతిలో ఇంటిపెద్ద హ‌తం

ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాలో ఓ వ్యక్తిని అతని భార్య, అతని 16 ఏళ్ల కొడుకు హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. జిల్లాలోని గజ్రోలా ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ వ్యక్తి మద్యానికి బానిస అయ్యాడు. మృతుడిని తేజ్‌పాల్‌గా గుర్తించారు. అతను తరచూ తన భార్యను కొట్టేవాడు. మద్యానికి బానిసైన కారణంగా తన నాలుగు ఎకరాల భూమిని కూడా విక్రయించాడు.

ఈ సంఘటన జరిగిన రోజు, బాధితుడు మద్యం మత్తులో ఇంటికి వచ్చి తన భార్యను కొట్టడం ప్రారంభించాడని సమాచారం. అతని 16 ఏళ్ల కుమారుడు తండ్రి చర్యలను వ్యతిరేకించాడు. దీంతో ఆ వ్యక్తి కొడుకుపై దాడి చేశాడు. క్షణికావేశంలో ఆ వ్యక్తిని భార్య, కొడుకు కలిసి గొంతు నులిమి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు. "ఒక వ్యక్తిని అతని భార్య, అతని మైనర్ కొడుకు చంపాడు. మద్యం మత్తులో బాధితుడు తన భార్యను నిర్దాక్షిణ్యంగా కొట్టడంతో ఈ సంఘటన జరిగింది. ఈ కేసులో మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసాము," అని సర్కిల్ ఆఫీసర్ సతీష్ శుక్లా తెలిపారు. ఈ ఘటనపై పూర్తీ దర్యాప్తు ప్రారంభించారు.


Next Story