నిషాకు బానిసై రక్తంతో తడిసిన చేతులు.. డ్రగ్స్‌కు డబ్బులు తక్కువ కావడంతో..

Delhi Man stabbed to death police solved case acussed robbed deceased. దేశ రాజధాని ఢిల్లీలోని ఖజురీ ఖాస్ ప్రాంతంలో ఓ యువకుడిని కత్తితో పొడిచి చంపారు.

By Medi Samrat  Published on  22 April 2023 11:39 AM GMT
నిషాకు బానిసై రక్తంతో తడిసిన చేతులు.. డ్రగ్స్‌కు డబ్బులు తక్కువ కావడంతో..

దేశ రాజధాని ఢిల్లీలోని ఖజురీ ఖాస్ ప్రాంతంలో ఓ యువకుడిని కత్తితో పొడిచి చంపారు. మృతుడు సోనియా విహార్‌కు చెందిన వరుణ్‌గా గుర్తించారు. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు ధృవీక‌రించారు. యువకుడిపై కత్తితో దాడి చేసిన నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో నిందితుడు ప్రదీప్ మిశ్రా రోజూ డ్రగ్స్ తాగేవాడని చెప్పాడు. హత్య జరిగిన రోజు ప్రదీప్‌కు డబ్బు లేకపోవడంతో మార్గమధ్యంలో యువకుడిని దోచుకునేందుకు ప్రయత్నించాడు. ఇంతలో వరుణ్ త‌ప్పించుకోవడానికి ప్రయత్నించాడు. వరుణ్ ప్ర‌తిఘ‌టించ‌డంతో నిందితుడు ప్రదీప్ మిశ్రా కత్తితో దాడి చేసి అత‌ని వ‌ద్ద ఉన్న‌ 1200 రూపాయలను దోచుకెళ్లాడు.

గాయపడిన వరుణ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ విషయానికి సంబంధించి పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవి కెమెరా ఫుటేజీని ప‌రిశీలించారు. ఫుటేజీ ద్వారా నిందితుడు ప్రదీప్ మిశ్రాను పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన రోజు నుంచి ప్రదీప్ ఆ ప్రాంతంలో కనిపించడం లేదని పోలీసులకు తెలిసింది. అనుమానం వచ్చిన పోలీసులు ప్రదీప్ కోసం వెతకడం ప్రారంభించారు. ప్రదీప్ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కఠినంగా విచారించారు. ఈ విచారణలో నిందితుడు ప్రదీప్ అన్నీ చెప్పాడు.

రోజుకు రూ.300 డ్రగ్స్ తీసుకునేవాడిన‌ని ప్రదీప్ చెప్పాడు. హత్య జరిగిన రోజు కేవలం రూ.150 మాత్రమే ఉందని, అందుకే వరుణ్‌ను దోచుకోవాలని ప్లాన్ చేసిన‌ట్లు విచార‌ణ‌లో వెల్ల‌డించాడు. వరుణ్ అడ్డుకోవ‌డంతో కత్తితో దాడి చేసిన‌ట్లు తెలిపాడు. గాయపడిన తర్వాత వరుణ్ తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. వరుణ్‌ని ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన 4 గంటల తర్వాత వరుణ్ ఆస్పత్రిలో మృతి చెందాడు.


Next Story