దారుణం.. అత్త, మామలను కుర్చీకి కట్టేసి.. సజీవదహనం చేసిన కోడలు, ఆమె లవర్‌

Daughter-in-law, lover arrested after elderly couple found dead in Punjab. పంజాబ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కోడలు తన ప్రియుడితో కలిసి అత్త, మామలను కుర్చీకి కట్టేసి సజీవ దహనం చేసింది. ఈ

By అంజి  Published on  3 Jan 2022 10:18 AM GMT
దారుణం.. అత్త, మామలను కుర్చీకి కట్టేసి.. సజీవదహనం చేసిన కోడలు, ఆమె లవర్‌

పంజాబ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కోడలు తన ప్రియుడితో కలిసి అత్త, మామలను కుర్చీకి కట్టేసి సజీవ దహనం చేసింది. ఈ ఘటన హోషియార్‌పూర్ జిల్లాలోని జాజా గ్రామంలో జరిగింది. వృద్ధ దంపతులను హత్య చేసిన కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. జనవరి 1న వృద్ధ దంపతుల మృతదేహం కాలిపోయి కనిపించింది. మృతులను ఆర్మీ మాజీ సుబేదార్ మంజిత్ సింగ్, అతని భార్య గుర్మీత్ కౌర్‌గా గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. వృద్ధ దంపతులు తమ వివాహేతర సంబంధాన్ని తెలుసుకున్నారని కోడలు ఈ దారుణ హత్యకు పాల్పడింది. నేరానికి పాల్పడిన కోడలు, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. వారిపై హత్య, నేరపూరిత కుట్ర అభియోగాల కింద కేసు నమోదు చేశారు.

ఘటన జరిగిన తర్వాత మృతుడి కుమారుడు రవీందర్ సింగ్ ఆ రాత్రి ఇంటికి తిరిగి వచ్చాడు. గేటు లోపలి నుండి తాళం వేసి ఉంది. ఇంట్లోకి రాగానే కుర్చీకి కట్టివేయబడిన తల్లిదండ్రుల మృతదేహాలు కాలిపోయాయి. రవీందర్‌ లోపలికి వెళ్లి చూడగా తల్లిదండ్రుల మృతదేహాలు కనిపించగా, మరో గదిలో కుర్చీకి భార్యను కట్టివేసి ఉండడం చూశాడు. తల్లిదండ్రులను హత్య చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఇంటికి వచ్చి కుర్చీకి కట్టేసి గదిలో ఉంచారని అతని భార్య పేర్కొంది. అతను లోపలికి వెళ్లడానికి గోడ ఎక్కాడు. వెంటనే రవీందర్‌ సింగ్‌ పోలీసులకు సమాచారం అందించాడు.

దొంగిలించబడిన నగదు, ఆభరణాలతో పాటు ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. నిందితులపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302, ౩౪, 120-బీ కింద అభియోగాలు మోపారు. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలోని ఓ హోటల్‌లో ఢిల్లీకి చెందిన ఓ యువకుడు గొంతు కోసి హత్యకు గురయ్యాడు. నజీబాబాద్‌లోని ఓ హోటల్‌లో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు ఢిల్లీలోని కళ్యాణ్‌పురి తూర్పు నివాసి మహ్మద్ షాబాజ్ జోజాగా గుర్తించారు.

Next Story