సూపర్ తల్లీ నువ్వు.. కొడుకును పోలీసులకు పట్టించావ్..!

చెన్నైలోని ఓ తల్లి తన కొడుకు డ్రగ్స్ మత్తులో జోగుతున్నాడని.. మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నాడాని తెలిసి అతన్ని అరెస్టు చేయించింది

By Medi Samrat  Published on  4 July 2024 3:00 PM GMT
సూపర్ తల్లీ నువ్వు.. కొడుకును పోలీసులకు పట్టించావ్..!

చెన్నైలోని ఓ తల్లి తన కొడుకు డ్రగ్స్ మత్తులో జోగుతున్నాడని.. మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నాడాని తెలిసి అతన్ని అరెస్టు చేయించింది. అంతేకాకుండా గంజాయి స్మగ్లింగ్ రాకెట్‌ను ఛేదించడంలో పోలీసులకు సహాయపడింది. లోడ్ వెహికిల్ డ్రైవర్ అయిన శ్రీరామ్ ఇటీవలే గంజాయి అలవాటును పెంచుకున్నాడు. ఈ విషయం అతని తల్లి బాగ్యలక్ష్మికి తెలియడంతో బుధవారం ఎంకేబీ నగర్ పోలీసులకు సమాచారం అందించింది. శ్రీరామ్ ఇంటికి చేరుకున్న పోలీసులు రూ.2 లక్షల విలువైన 630 ఎంఎల్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఆ బృందం శ్రీరామ్‌ను విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చింది. ఒడిశా నుంచి కార్గో ట్రిప్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి 300 ఎంఎల్‌ గంజాయిని తీసుకొచ్చినట్లు శ్రీరామ్ తెలిపాడు.కేరళకు చెందిన అరుణ్ అనే వ్యక్తి ఇచ్చిన కాంటాక్ట్ ద్వారా చెన్నైలోని మాధవరం ప్రాంతంలోని గుర్తు తెలియని వ్యక్తికి వస్తువును అందజేసినట్లు శ్రీరామ్ తెలిపారు. అప్పుడు పోలీసులు ట్రాక్ చేసి, ఆ వ్యక్తిని 'గంజా బ్రదర్స్' అని పిలవబడే అరుణ్ సోదరుడు సతీష్‌గా గుర్తించారు.

వీరిద్దరూ ఇతర రాష్ట్రాల నుంచి గంజాయిని స్మగ్లింగ్ చేసేందుకు శ్రీరామ్, మరో లోడ్ వెహికిల్ డ్రైవర్ పర్వేజ్‌లను ఉపయోగించుకున్నారు. స్నిఫర్ డాగ్‌లు గుర్తించడం కష్టం కాబట్టి అక్రమ రవాణా చేయడం సులభమని వారు ఇటీవల గంజాయి నూనెను మార్కెట్ లోకి తీసుకుని రావడం మొదలుపెట్టారు. అరుణ్ ఆదేశాల మేరకు స్థానిక వ్యక్తికి ఇవ్వాల్సిన 630 ఎంఎల్ గంజాయి నూనెను శ్రీరామ్ వాడడంతో ఈ రాకెట్ వెలుగులోకి వచ్చింది. ఆయిల్ తాగిన తర్వాత తన కొడుకు ప్రవర్తనలో మార్పు రావడంతో శ్రీరామ్ తల్లి పోలీసులను అప్రమత్తం చేసి, రాకెట్‌ను ఛేదించడంలో వారికి సహాయపడింది. ఈ ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారు.

Next Story