జూదానికి బానిసైన భర్త.. భార్యను చివరికి..

Bihar man loses wife in bet. జూదానికి బానిసైతే ఉన్నదంతా అమ్ముకుంటాం.. పరువంతా పోగొట్టుకుంటూ

By Medi Samrat  Published on  15 Dec 2020 10:20 AM GMT
జూదానికి బానిసైన భర్త.. భార్యను చివరికి..

జూదానికి బానిసైతే ఉన్నదంతా అమ్ముకుంటాం.. పరువంతా పోగొట్టుకుంటూ ఉంటామని ఇప్పటికే చాలా ఘటనల ద్వారా మనకు తెలిసింది. తాజాగా అలాంటి ఓ ఘటన బిహార్ లోని భగల్పూర్లో చోటు చేసుకుంది. జూదానికి బానిసై సర్వం కోల్పోయి చివరికి కట్టుకున్న భార్యను తాకట్టు పెట్టాడు. తన స్నేహితులతో గడపాలని ఒత్తిడి చేశాడు. నిరాకరించడంతో యాసిడ్ పోసి చిత్ర హింసలకు గురి చేశాడు. భర్త బలవంతంతో రెండు, మూడుసార్లు స్నేహితులతో గడిపిన మహిళ ఆ తర్వాత ఒప్పుకోలేదు. దీంతో ఆమెపై భర్త యాసిడ్తో దాడి చేశాడు. ఈ విషయాన్ని దాచేందుకు నిందితులు ఆమెను మొజాహిద్పూర్లోని ఓ ఇంట్లో దాచి ఉంచారు. భర్త చెర నుంచి తప్పించుకొని బాధితురాలు లోధిపూర్లోని తండ్రి ఇంటికి చేరడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులతో మొత్తం విషయం చెప్పిన ఆమె వెంటనే అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆమెను ఆసుపత్రికి తరలించిన పోలీసులు, నిందితులను అదుపులోకి తీసుకున్నారు.తనపై యాసిడ్ పోసి దాడి చేశాడని భర్తపై ఓ మహిళ ఫిర్యాదు చేశారు.. ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేశామని.. వైద్య పరీక్షల కోసం మహిళను ఆసుపత్రిలో చేర్పించామనిని భగల్పూర్ ఎస్ఎస్పీ ఆశిష్ భార్తీ తెలిపారు. మిగిలిన నిందితులను పట్టుకుంటామని. ఈ కేసుతో సంబంధమున్న ఎవరినీ విడిచిపెట్టమని మొజాహిద్పూర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో రాజేశ్ కుమార్ ఝా అన్నారు. బెట్ లో ఓడిపోయానని, అందులో భాగంగానే గెలిచిన వారికి తన భార్యను ఓ నెల పాటు అప్పజెప్పేందుకు సిద్ధమయ్యాయట సదరు భర్త. రెండు, మూడు సార్ల తర్వాత వెళ్లేందుకు బాధితురాలు తీవ్రంగా నిరాకరించడంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు.


Next Story