అస్థికల నిమజ్జనానికి వెళ్తూ ఆరుగురు దుర్మ‌ర‌ణం

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

By -  Medi Samrat
Published on : 1 Oct 2025 10:50 AM IST

అస్థికల నిమజ్జనానికి వెళ్తూ ఆరుగురు దుర్మ‌ర‌ణం

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హర్యానాలో నివసిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. కాగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సమాచారం ప్రకారం.. ముజఫర్‌నగర్‌లోని టిటావి ప్రాంతంలోని పానిపట్ ఖతిమా రోడ్డులోని ధాబా వద్ద ఆగి ఉన్న ట్రక్కును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. కుటుంబం అస్థికలతో కర్నాల్ నుండి హరిద్వార్ వెళుతోంది.

ముజఫర్‌నగర్‌లోని పానిపట్-ఖతిమా హైవేలోని బాఘ్రా బైపాస్‌లోని ధాబా వద్ద ఆగి ఉన్న ట్రక్కును వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హర్యానాలోని కర్నాల్ జిల్లా ఫరీద్‌పూర్ నుంచి హరిద్వార్‌కు అస్థికల నిమజ్జనానికి వెళ్తున్న ఆరుగురు మృతి చెందారు. ప్ర‌మాదం జరిగిన వెంట‌నే అరుపులు వినిపించాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఫరీద్‌పూర్‌కు చెందిన మహేంద్ర ఇటీవల మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం ఆయన కుమారుడు పీయూష్, ఇతర కుటుంబ సభ్యులు మోహిని, అంజు, విక్కీ రాజేంద్ర, హార్దిక్, శివ చితాభస్మంతో హరిద్వార్ వెళ్తున్నారు. టిటావి ప్రాంతంలోని బఘ్రా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన హార్దిక్‌ను ఆసుపత్రికి తరలించారు. కాగా ఆరుగురు మృతి చెందారు.

Next Story