రెండు కార్లు.. 11మంది.. 18 వేట కత్తులు.. ఎక్కడికి ప్రయాణం?
Bengaluru has arrested 11 persons including two rowdy sheeters. తనిఖీల్లో ఇద్దరు రౌడీషీటర్లు ప్రయాణిస్తున్న రెండు కార్లు పట్టుబడ్డాయి.
By Medi Samrat Published on 24 Feb 2021 5:51 AM GMT
దేశంలో ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా రోజురోజుకు హింస పెరుతూనే ఉంది. నేరస్థులు పుట్టుకొస్తూనే ఉన్నారు. నడి రోడ్డుపై నరికి చంపడం, బతికివున్న మనిషిని కారుతో ఢీకొట్టి చంపడం ఇటీవల మనం చూశాం. ఇవేకాక ఎన్నో ఘోరాలను చూస్తూన్నాం. అయితే.. రౌడీయిజం కట్టడికి పోలీసులు పకడ్భందీ చర్యలు చేపడుతున్నా.. యధేచ్చగా వేట కత్తులతో తిరుగుతున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
Karnataka: Central Crime Branch, Bengaluru has arrested 11 persons including two rowdy sheeters, 18 sharp weapons and 2 cars seized pic.twitter.com/Cpm3VsfU9m
వివరాళ్లోకెళితే.. కర్ణాటకలోని మార్తహల్లి పోలీసు స్టేషన్ పరిధిలో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మంగళవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇద్దరు రౌడీషీటర్లు ప్రయాణిస్తున్న రెండు కార్లు పట్టుబడ్డాయి. దీంతో కార్లను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వారితో పాటు మరో 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఆ కార్లలో పోలీసులు 18 వేట కత్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారు కత్తులను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎందుకు తీసుకెళ్తున్నారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకేసారి పెద్దఎత్తున్న వేట కత్తులు, రౌటీ షీటర్లు పట్టుబడటంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.