విజయవాడలో నున్న ప్రాంతంలో బాలికపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటన కలకలం రేగింది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కృష్ణలంక పోలీసుల వివరాల మేరకు, కృష్ణాజిల్లా నూజివీడు మండలానికి చెందిన ఇంటర్ చదువుతున్న బాలికకు, బెంగుళూరుకు చెందిన అంజనేయులు ఫేస్బుక్లో పరిచయమయ్యాడు. తాను శనివారం విజయవాడ వస్తున్నట్టు బాలికకు, అతడు సమాచారం ఇచ్చాడు. దీంతో బాలిక, తన స్నేహితులతో కలిసి విజయవాడ చేరుకుంది. వీరంతా దుర్గగుడికి వెళ్లారు. తర్వాత ఇళ్లకు వెళ్లిపోయారు.
ఆంజనేయులు తాను ఒక లాడ్జిలో ఉంటున్నట్టు చెప్పగా, బాలిక మళ్లీ విజయవాడ వచ్చింది. ఆమెను గమనించిన విజయవాడ సింగ్నగర్కు చెందిన ఆటోడ్రైవర్.. ఆంజనేయులు ఉన్న లాడ్జిని తాను చూపిస్తానంటూ ఆమెను ఆటోలో ఎక్కించుకుని నేరుగా నున్న ప్రాంతంలోని పొలాల్లోకి తీసుకువెళ్లి అత్యాచారయత్నం చేశాడు. బాలిక పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు గమనించి ఆమెను కృష్ణలంక పోలీసుస్టేషన్కు తీసుకువచ్చారు. అప్పటికే ఆటో డ్రైవర్ పరారయ్యాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు సీసీఫుటేజీల ఆధారంగా ఆటో ఏ ప్రాంతానికి చెందినదా అని గుర్తించే పనిలో ఉన్నారు.