సోషల్ మీడియా పరిచయం : అమ్మాయిని ఇంటికి పిలిచి కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి..

As she met her lover via social media, she found. సోషల్ మీడియాలో స్నేహం ఓ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన ఘటన గ్వాలియర్‌

By Medi Samrat  Published on  26 Nov 2021 10:32 AM GMT
సోషల్ మీడియా పరిచయం : అమ్మాయిని ఇంటికి పిలిచి కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి..

సోషల్ మీడియాలో స్నేహం ఓ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన ఘటన గ్వాలియర్‌ లో బయట వచ్చింది. ఓ యువకుడితో యువతి సోషల్ మీడియా లో చేసిన స్నేహం పలు మలుపులు తిరిగింది. యువకుడు ఆ యువతితో స్నేహం చేసి.. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. ఓ రోజు ఆ యువకుడు యువతిని ఇంటికి పిలిపించాడు. శీతల పానీయాలు తాగించి ఆమె అపస్మారక స్థితికి చేరుకున్నాక ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారానికి పాల్పడిన యువకుడు ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడు. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కొన్ని నెలల క్రితం మొరెనా జిల్లాలోని కైలారస్‌లో నివాసం ఉంటున్న నిఖిల్ సోనీతో సోషల్ మీడియాలో స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరూ మాట్లాడుకుని ప్రేమలో పడ్డారు.

నిఖిల్ తన కుటుంబాన్ని కలవడానికి విద్యార్థిని గ్వాలియర్‌లోని పడవ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ కుశాల్ నగర్‌కు పిలిచాడు. విద్యార్థిని వచ్చేసరికి ఇంట్లో నిఖిల్ తప్ప మరెవరూ లేరు. విద్యార్థిని నిఖిల్‌ను అతని కుటుంబ సభ్యుల గురించి అడగగా.. నిఖిల్ తన కుటుంబం ఇంటి పనుల కోసం మార్కెట్‌కు వెళ్లిందని.. త్వరలో వస్తారని చెప్పాడు. అనంతరం విద్యార్థినికి శీతల పానీయం అందించాడు నిందితుడు.. విద్యార్థిని మత్తు మందు కలిపిన శీతల పానీయం తాగిన వెంటనే స్పృహతప్పి పడిపోయింది. ఆ తర్వాత స్పృహలోకి రాగానే తనపై అత్యాచారానికి పాల్పడ్డారని తెలిసింది. విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో, యువకుడు పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. ఆ తర్వాత విద్యార్థిని యువకుడిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో యువకుడు నిరాకరించాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


Next Story