టిఫిన్ లో ఉప్పు ఎక్కువగా వేసిందని భార్యను చంపేసిన భర్త

Angry over excess salt in food, man kills wife. టిఫిన్ లో ఉప్పు ఎక్కువగా వేసిందని ఒక వ్యక్తి తన 40 ఏళ్ల భార్యను హతమార్చాడు.

By Medi Samrat
Published on : 16 April 2022 6:06 PM IST

టిఫిన్ లో ఉప్పు ఎక్కువగా వేసిందని భార్యను చంపేసిన భర్త

టిఫిన్ లో ఉప్పు ఎక్కువగా వేసిందని ఒక వ్యక్తి తన 40 ఏళ్ల భార్యను హతమార్చాడు. మహారాష్ట్రలోని థానే జిల్లా భయాందర్ టౌన్‌షిప్‌లోని వారి నివాసంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆమె తయారు చేసిన అల్పాహారంలో ఉప్పు ఎక్కువ ఉందనే కోపంతో హత్య చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం భయాందర్ ఈస్ట్‌లోని ఫటక్ రోడ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఘటన తరువాత పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

నిందితుడిని నీలేష్ ఘాగ్ (46)గా గుర్తించారు. ఆ వ్యక్తి ఉదయం 9.30 గంటల ప్రాంతంలో తన భార్య నిర్మలని గొంతు కోసి చంపాడు. ఆమె వండిన 'ఖిచాడీ'లో ఉప్పు ఎక్కువ ఉండటంతో కోపోద్రిక్తుడై భార్యను హత్య చేశాడని మీరా భయందర్-వసాయి విరార్ పోలీసు కమిషనరేట్ అధికారి తెలిపారు. విషయం గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. ఈ హత్యకు మరేదైనా కారణం ఉందా అని పోలీసులు ఆరాతీస్తున్నారు. భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 302 (హత్య) కింద ఆ వ్యక్తిపై భయాందర్‌లోని నవ్‌ఘర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది.









Next Story