షాకింగ్ : ఒకే ఇంట్లో తొమ్మిది మృతదేహలు

9 Members Of Family Found Dead At Home In Maharashtra. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఒకే ఇంట్లో 9 మృతదేహాలు లభ్యమయ్యాయి.

By Medi Samrat
Published on : 20 Jun 2022 5:45 PM IST

షాకింగ్ : ఒకే ఇంట్లో తొమ్మిది మృతదేహలు

మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఒకే ఇంట్లో 9 మృతదేహాలు లభ్యమయ్యాయి. మాయిసాల్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వీరంతా ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వీరిలో ముగ్గురి మృతదేహాలు ఒకే చోట పడివుండగా, మిగిలిన ఆరు మృతదేహాలు ఇంట్లో వివిధ చోట్ల పడివుండడాన్ని పోలీసులు గుర్తించారు. వారంతా విషం తాగి చనిపోయి ఉంటారని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. పోస్టుమార్టం అనంతరం దీనిపై స్పష్టత రానుంది. వారి ఆత్మహత్యకు కారణమేంటన్నది తెలియరాలేదు.

మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో సోమవారం ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది వారి ఇంట్లో శవమై కనిపించారని, ఇది ఆత్మహత్యగా పోలీసులు అనుమానిస్తున్నారని పోలీసులు తెలిపారు. ముంబైకి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాంగ్లీ జిల్లాలోని మహైసల్‌లోని ఓ ఇంట్లో మృతదేహాలు లభ్యమయ్యాయి. "మేము ఒక ఇంట్లో తొమ్మిది మృతదేహాలను కనుగొన్నాము. మూడు మృతదేహాలు ఒకే చోట, ఆరు ఇతర వేర్వేరు ప్రదేశాలలో ఇంట్లో లభ్యమయ్యాయి" అని సాంగ్లీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దీక్షిత్ గెడమ్ చెప్పారు. పోలీసులు సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తూ ఉన్నారని.. మరణానికి గల కారణాలను తెలుసుకుంటూ ఉన్నారని చెప్పారు. ఇది ఆత్మహత్యగా అనుమానిస్తున్నట్లు మరో పోలీసు అధికారి తెలిపారు. అయితే పోస్టుమార్టం అనంతరం మృతికి కచ్చితమైన కారణం తెలియనుంది.










Next Story