ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

5 Dead In Chittore Accident. ఆదివారం మధ్యాహ్నం చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం జ‌రిగింది. పూతలపట్టు-నాయుడుపేట

By Medi Samrat  Published on  5 Dec 2021 10:53 AM GMT
ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

ఆదివారం మధ్యాహ్నం చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం జ‌రిగింది. పూతలపట్టు-నాయుడుపేట రహదారిపై చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న చిన్నారి సహా ఐదుగురు మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో తిరుపతి లోని రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో 8 మంది ఉన్నట్టు స్థానికులు తెలిపారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మంటలార్పి కారులోని మృతదేహాలను బయటకు తీశారు. మృతులు విజయనగరం జిల్లా వాసులుగా పోలీసులు భావిస్తున్నారు. కారు నెంబరు AP39HA 4003గా గుర్తించారు.


Next Story