క్రికెట్ స్టంప్‌లతో.. కబడ్డీ ఆటగాడి హత్య

26-year-old Kabaddi player killed in Mumbai's Dharavi. ముంబైలోని ధారావి ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం 26 ఏళ్ల కబడ్డీ క్రీడాకారుడు

By Medi Samrat
Published on : 24 July 2022 5:10 PM IST

క్రికెట్ స్టంప్‌లతో.. కబడ్డీ ఆటగాడి హత్య

ముంబైలోని ధారావి ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం 26 ఏళ్ల కబడ్డీ క్రీడాకారుడు హత్యకు గురయ్యాడు. హత్యకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. క్రికెట్ స్టంప్‌లతోనూ, పదునైన వస్తువులను ఉపయోగించి అతడిని చంపేశారు. అతడిని వృత్తిరీత్యా టెక్నీషియన్‌ విమల్‌రాజ్‌ నాడార్‌గా గుర్తించారు. బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ పెద్ద సంఖ్యలో ప్రజలు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. పాత కక్షలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై తదుపరి విచారణ ఇంకా కొనసాగుతోంది.

న్యాయం చేయాలంటూ స్థానికులు ఆగ్రహించడంతో స్థానిక నేతలు ధారావి ప్రజలను శాంతింపజేయడానికి జోక్యం చేసుకున్నారు. "వారికి పాత శత్రుత్వం ఉంది. శుక్రవారం అర్థరాత్రి 3:30 గంటల ప్రాంతంలో ముగ్గురు-నలుగురు వ్యక్తులు అతడిని హత్య చేశారు. ఇది పథకం ప్రకారం జరిగిన హత్య అని, ముగ్గురు వ్యక్తులు కూడా పరుగెత్తుకుంటూ వెళ్లడం సీసీటీవీలో రికార్డు అయ్యాయి. దీనికి సంబంధించి ముగ్గురిని అరెస్టు చేశారు' అని బీజేపీ నేత తమిళ్‌ సెల్వన్‌ తెలిపారు. విమల్ రాజ్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారని, కబడ్డీ అసోసియేషన్, ఇతర ఏజెన్సీలు కూడా అన్ని సహాయాలు అందిస్తాయని స్థానిక నాయకుడు తెలిపారు.


















Next Story