ల్యాండ్‌మైన్ పేలడంతో 10 మంది దుర్మ‌ర‌ణం..

10 Killed by landmine in Somalia. దక్షిణ సోమాలియాలో శుక్రవారం ఒక మినీవ్యాన్‌ కింద ల్యాండ్‌మైన్ పేలడంతో

By Medi Samrat  Published on  5 Feb 2022 12:49 PM GMT
ల్యాండ్‌మైన్ పేలడంతో 10 మంది దుర్మ‌ర‌ణం..

దక్షిణ సోమాలియాలో శుక్రవారం ఒక మినీవ్యాన్‌ కింద ల్యాండ్‌మైన్ పేలడంతో ఐదుగురు మహిళలు మరియు నలుగురు పిల్లలు సహా 10 మంది ప్రయాణికులు మరణించారు. దక్షిణ సోమాలియాలోని జుబాలాండ్ స్టేట్‌లోని ఆర్మీ కమాండర్ దేకోవ్ అబ్దినుర్ అడెన్ మాట్లాడుతూ, ప్యాసింజర్ బస్సు దక్షిణ ఓడరేవు నగరమైన కిస్మాయోకు వెళుతుండగా ల్యాండ్‌మైన్‌ను తాకినట్లు చెప్పారు.

ఉగ్రవాదులు పెట్టిన ఈ ల్యాండ్ మైన్ పేలుడులో మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారు కిస్మాయోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, అని అడెన్ స్థానిక మీడియాకు తెలిపారు. ల్యాండ్‌మైన్ పేలుడు సమయంలో జుబాలాండ్ స్టేట్ దళాలు అల్-షబాబ్ ఉగ్రవాదులతో పోరాడుతున్నాయని, కిస్మాయో ఉత్తర ప్రాంతంలో జరిగిన ఆపరేషన్‌లో ఇద్దరు సైనికులు గాయపడగా, పలువురు ఉగ్రవాదులు మరణించారని అడెన్ చెప్పారు.


Next Story