భారత్‌లో కరోనా మరణమృదంగం.. 40వేలు దాటిన మృతులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Aug 2020 5:18 AM GMT
భారత్‌లో కరోనా మరణమృదంగం.. 40వేలు దాటిన మృతులు

భారత్‌లో కరోనా మరణ మృదంగం కలవరపెడుతోంది. గత కొద్ది రోజులుగా నిత్యం 850పైగా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. గడిచిన 24 గంటల్లో 904 మంది ఈ మహమ్మారి బారీన పడి మృత్యువాత పడ్డారని కేంద్ర, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. దేశంలో కరోనా వ్యాప్తి మొదలైన తరువాత ఒక రోజు వ్యవధిలో అత్యధిక మంది మృతి చెందడం ఇదే తొలిసారి. వీటితో కలిపి దేశంలో కరోనా మరణాల సంఖ్య 40,699కి చేరింది.

నిన్న ఒక్క రోజే 56,282 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,64,536కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో 13,28,337 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. 6,64,949 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్క రోజే 6,64,949 శాంపిళ్లను పరిక్షించగా.. మొత్తంగా 2,21,49,351 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 67 శాతం ఉండగా.. మరణాల రేటు 2.09శాతంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో ఉండగా.. అత్యధిక మరణాలు నమోదు అవుతున్న దేశాల్లో ఐదో స్థానంలో ఉంది.

Next Story