ఏపీలో నాలుగు లక్షలు దాటిన కరోనా కేసులు
By తోట వంశీ కుమార్ Published on 29 Aug 2020 7:54 AM ISTఆంధ్రప్రదేశ్లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగు లక్షలను దాటాయి. గడిచిన 24గంటల్లో 61,331 శాంపిల్స్ను పరీక్షించగా.. 10,526 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్లో వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 4,03,616కి చేరింది.
కొవిడ్ వల్ల చిత్తూరులో పది మంది, కడపలో తొమ్మిది మంది, నెల్లూరులో ఎనిమిది మంది, ప్రకాశంలో ఎనిమిది మంది, పశ్చిమగోదావరిలో ఎనిమిది మంది, తూర్పుగోదావరిలో ఆరుగురు, కర్నూల్లో ఆరుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, అనంతపూర్లో ఐదుగురు, కృష్ణలో ఐదుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, గుంటూరులో నలుగురు, విజయనగరంలో ఒక్కరు చొప్పున మొత్తం 81 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 3,714 కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 3,03,711 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 96,191 మంది చికిత్స పొందుతున్నారు.
కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..
అనంతపురంలో 833,
చిత్తూరులో 819,
ఈస్ట్ గోదావరిలో 1178,
గుంటూరులో 801,
కడపలో 501,
కృష్ణలో 414,
కర్నూలులో 757,
నెల్లూరులో 1151,
ప్రకాశంలో 874,
శ్రీకాకుంలో 764,
విశాఖపట్నంలో 896,
విజయనగరంలో 552,
పశ్చిమ గోదావరిలో 986 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.