ఏపీలో లక్షా యాభైవేలు దాటిన కరోనా కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Aug 2020 12:09 PM GMT
ఏపీలో లక్షా యాభైవేలు దాటిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ఉద్దృతి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 60,797 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 9,276 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,50,209కి చేరింది.

కొవిడ్‌ వల్ల గుంటూరులో ఏడుగురు, అనంతపూర్‌లో ఆరుగురు, చిత్తూరులో ఆరుగురు, కర్నూల్‌లో ఆరుగురు, శ్రీకాకుళంలో నలుగురు, కృష్ణలో ముగ్గురు, పశ్చిమగోదావరిలో ముగ్గురు, నెల్లూరులో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు, కడపలో ఒక్కరు చొప్పున మొత్తం 88 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 1,407 కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 76,614 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 72,188 మంది చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 1128,

చిత్తూరులో 949,

ఈస్ట్‌ గోదావరిలో 876,

గుంటూరులో 1001,

కడపలో 547,

కృష్ణలో 357,

కర్నూలులో 1234,

నెల్లూరులో 559,

ప్రకాశంలో 402,

శ్రీకాకుంలో 455,

విశాఖపట్నంలో 1155,

విజయనగరంలో 119,

పశ్చిమ గోదావరిలో 494 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.



Next Story