డిజిటల్ పానీ.. నయా స్టార్టప్.. సరికొత్త ఆలోచన

On a mission to reuse wastewater to ensure water security for India. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని ఒక వాణిజ్య సముదాయంలో మురుగునీటి శుద్ధి కర్మాగారం దాదాపు 14 ఏళ్ల నాటిది

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 April 2022 10:37 AM GMT
డిజిటల్ పానీ.. నయా స్టార్టప్.. సరికొత్త ఆలోచన

ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని ఒక వాణిజ్య సముదాయంలో మురుగునీటి శుద్ధి కర్మాగారం దాదాపు 14 ఏళ్ల నాటిది. అయితే అది ఇప్పుడు పనిచేయడం లేదు. దాని ఫిల్టర్లు పనికి రాకుండా అయిపోయాయి. వాటి పంపులు విరిగిపోయాయి. 'డిజిటల్ పానీ'.. ఇండియన్ వాటర్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్ స్టార్ట్-అప్ మాత్రం దాని రూపు రేఖలను ఏకంగా మార్చేసింది. ఇప్పుడు ఆ మురుగునీటి శుద్ధి కర్మాగారం చాలా కొత్తదిలా మారిపోయింది.

"మేము సెన్సార్లను ప్లగ్ ఇన్ చేసాము.. ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో గుర్తించాము. కావాల్సిన పనులను చేశాం. మా సాఫ్ట్‌వేర్, మాడ్యూల్స్ సహాయంతో, ప్రాథమిక పరిజ్ఞానం ఉన్న ఎవరైనా మురుగునీటి శుద్ధి కర్మాగారాన్ని నిర్వహించవచ్చు. మేము ప్లాంట్‌లను నాన్-ఫంక్షనల్ నుండి నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ అధిక నీటికి శుద్ధి చేసే యూనిట్‌లుగా మారుస్తాము" అని డిజిటల్ పానీ వ్యవస్థాపకురాలు, CEO అయిన మాన్సీ జైన్ చెప్పారు. సరస్సులు, ఇతర నీటి వనరులను కలుషితం చేస్తూ ఉంటాయి మురికి నీరు. శుద్ధి చేయని మురికి నీరు పర్యావరణాన్ని ఎంతో కలుషితంగా మారుస్తూ ఉంటాయి. మాన్సీ తండ్రి, సహ వ్యవస్థాపకుడు రాజేష్ జైన్ కూడా ఈ మిషన్ లో తోడ్పాటును అందించారు.


స్వచ్ఛమైన నీరు ఒక ప్రాథమిక అవసరం. ప్రతి ఒక్కరూ మంచినీటిని శుద్ధి చేయడం, ఉపయోగించడం కోసం కృషి చేస్తున్నారు. అయితే మంచినీరు దొరకడం లేదు.. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. నీటి అవసరాలను తీర్చడానికి మురుగునీటి సామర్థ్యాన్ని ఉత్ప్రేరకపరిచే లక్ష్యంతో డిజిటల్ పానీ స్థాపించబడింది. వచ్చే ఐదేళ్లలో రోజుకు 195 మిలియన్ లీటర్ల మురుగునీరు.. నీటి వనరులలోకి చేరకుండా నిరోధించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ స్టార్టప్. "మురుగునీటిని శుద్ధి చేయడం, తిరిగి ఉపయోగించడం ద్వారా 65% పట్టణ నీటి అవసరాలను తీర్చవచ్చు. చాలా మురుగునీటి శుద్ధి కర్మాగారాలు వాటిని ఏర్పాటు చేసిన కొన్ని సంవత్సరాలలో పనికిరాకుండా పోతున్నాయి" అని మాన్సీ చెప్పారు.



డిజిటల్ పానీ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్ వేర్ ప్లాట్ ఫామ్ లను తీసుకుని వచ్చింది.. అంతేకాకుండా ఆటోమేటెడ్ హార్డ్ వేర్ టూల్స్ ను వాడుతూ పాత సీవేజ్ ప్లాంట్స్ ను తిరిగి పునరుద్ధరించేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. "మురుగునీటి శుద్ధి కర్మాగారాలు పని చేయడం ఆగిపోవడానికి ప్రధాన కారణం వాటిని రిపేర్ చేసే నైపుణ్యం లేకపోవడమే. మేము అవసరమైన నైపుణ్యాన్ని అందించడమే కాకుండా సమగ్ర విధి నిర్వహణ, ఆటోమేషన్ ద్వారా కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం ద్వారా కాలక్రమేణా నిర్వహణ ఖర్చులను తగ్గిస్తుంది," అని మాన్సీ వివరించారు. "మేము ప్లాంట్‌లోని కీలక భాగాలలో దాదాపు 15 సెన్సార్‌లను ప్లగ్ ఇన్ చేస్తాము, అవి సమస్యలను గుర్తిస్తాయి. సాఫ్ట్‌వేర్‌తో పాటు, రియల్ టైమ్ డేటా ఆధారంగా పరికరాలను, కీలక ప్రక్రియలను నియంత్రించడానికి దీర్ఘకాలిక ఆటోమేషన్ కూడా అందించబడుతుంది. సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడం, మేము రోజువారీ మొత్తం కార్యకలాపాల ప్రక్రియను స్వయంచాలకంగా నిర్వహించే నిర్వహణ మాడ్యూల్‌ను కూడా అందిస్తాము." అని ఆమె తెలిపింది. ఎప్పుడు ఫిల్టర్లను క్లీన్ చేయాలి, ఎప్పుడు కెమికల్స్ ను ఉపయోగించాలి.. వంటి కీలకమైన సమాచారాన్ని మేము అందిస్తూ ఉంటాం. "సమస్యలను నిర్ధారించడానికి, లైవ్ డ్యాష్‌బోర్డ్ నివేదికలను అందించడానికి ఒక అనలిటిక్స్ మాడ్యూల్ మా కస్టమర్‌లకు అందిస్తాము" అని మాన్సీ చెప్పారు. డిజిటల్ పానీ భారతదేశం అంతటా 25 మురుగునీటి శుద్ధి ప్లాంట్‌లతో పని చేయడానికి సిద్ధంగా ఉంది.INK@WASH 3.0లో పాల్గొనే అనేక కంపెనీలలో డిజిటల్ పానీ ఒకటి (Innovations & New Knowledge in Water, Sanitation and Hygiene) మే 2022లో హైదరాబాద్‌లో INK@WASH 3.0 జరగనుంది.

NewsMeter is the formal media partner for INK@WASH 3.0. This article has been written by NewsMeter in association with the Administration Staff College of India (ASCI).



















Next Story