అమెరికా ప్రభుత్వం భారత దిగుమతులపై 25 శాతం అదనపు సుంకాన్ని ప్రకటించిన తర్వాత పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపడంతో శుక్రవారం హైదరాబాద్లో బంగారం ధరలు గతంలో ఎన్నడూ లేని స్థాయికి పెరిగాయి. భారత దిగుమతులపై అదనంగా 25 శాతం సుంకం విధిస్తామంటూ అమెరికా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో.. వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు.
శుక్రవారం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.94,700గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,03,310కి చేరుకుంది. సంవత్సరం ప్రారంభంలో ధరలతో పోల్చితే.. జనవరిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,500 ఉండగా.. 24-క్యారెట్ల బంగారం ధర రూ. 78,000 ఉంది. ఇవి 32 శాతానికి పైగా పెరిగాయి.
హైదరాబాద్లో బంగారం ధరలు పెరగడం దేశవ్యాప్త ట్రెండ్లో భాగం. ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి ఇతర ప్రధాన నగరాల్లో కూడా గణనీయమైన పెరుగుదల ఉంది. బంగారం ధరల భవిష్యత్తు దిశ ప్రధానంగా US ఫెడ్ రేట్లు, టారిఫ్ విధానం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలపై ఆధారపడి ఉంటుంది.