అదానీ ఇప్పుడు ఆసియా లోనే టాప్

Adani Surpasses Mukesh Ambani, Becomes Asia’s Richest Person. అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ అయిన పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ఆసియాలోనే

By Medi Samrat  Published on  24 Nov 2021 1:44 PM GMT
అదానీ ఇప్పుడు ఆసియా లోనే టాప్

అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ అయిన పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ఆసియాలోనే కుబేరుడయ్యాడు. ఇప్పుడు అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం భారతదేశంలోనే కాకుండా మొత్తం ఆసియాలో అత్యంత ధనవంతుడుగా ఆయన నిలిచారు. ఆసియాలోనే కుబేరుడిగా ఉన్న రిల‌య‌న్స్ అధినేత ముఖేష్ అంబానీని అదానీ గ్రూప్ అధినేత గౌత‌మ్ అదానీ దాటుకుని వెళ్లారు. ఇప్ప‌టి వ‌ర‌కు రెండో స్థానంలో ఉన్న గౌత‌మ్ అదానీ మొద‌టి స్థానాన్ని ఆక్ర‌మించారు. ఈరోజు అదానీ షేర్లు పుంజుకోవ‌డంతో అదానీ దేశంలో అత్యంత ధ‌న‌వంతుడిగా రికార్డ్ సాధించిన‌ట్లు బ్లూంబ‌ర్గ్ ఇండెక్స్ తెలియ‌జేసింది. భారతదేశంలో అతిపెద్ద పోర్ట్ ఆపరేటర్ అయిన అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ గౌతమ్ అదానీ. ఫోర్బ్స్ ప్రకారం, అతను ఆస్ట్రేలియాలోని బొగ్గు గనుల ప్రాజెక్ట్ అయిన అబాట్ పాయింట్‌కు కూడా యజమాని అన్న సంగతి తెలిసిందే..!

ఏప్రిల్ 2020 నుండి అదానీ నికర విలువలో గణనీయమైన పెరుగుదల ఉంది. 18 మార్చి 2020న, అతని నికర విలువ $4.91 బిలియన్లు. 20 నెలల్లో, అతని నికర విలువ $83.89 బిలియన్లకు చేరుకుంది, ఇది 1808 శాతం పెరిగింది. అదానీ గ్రూప్ కంపెనీ లలో ఒకటైన అదానీ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ (ATL) భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ పవర్ ట్రాన్స్‌మిషన్ మరియు రిటైల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ గా నిలవడమే కాకుండా.. ఈ సంవత్సరం నవంబర్ 11 న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) యొక్క మొట్టమొదటి ఆపరేషనల్ సస్టైనబిలిటీ కాన్ఫరెన్స్-కమ్-కాంపిటీషన్‌లో మూడు అవార్డులను గెలుచుకుంది. ఎకనామిక్ సస్టైనబిలిటీ విభాగంలో ATL రెండు అవార్డులను గెలుచుకుంది. సహాయక వినియోగంపై దాని కేస్ స్టడీ కోసం గ్రీన్ ఎనర్జీ అడాప్షన్ కోసం ప్లాటినం అవార్డు మరియు క్లస్టర్ ఆధారిత నిర్వహణతో రిమోట్ (సెంట్రల్) ఆపరేషన్‌పై కేస్ స్టడీకి గోల్డ్ అవార్డు లభించింది. పర్యావరణ సస్టైనబిలిటీ ప్రాంతంలో సబ్‌స్టేషన్‌ల గ్రీనింగ్‌పై కేస్ స్టడీ కోసం ATL సిల్వర్ అవార్డును కూడా గెలుచుకుంది.


Next Story