ఏఎంఆర్డీఏను నోటిఫై చేస్తూ ఏపీ సర్కార్ ఆదేశాలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Aug 2020 8:14 AM GMT
ఏఎంఆర్డీఏను నోటిఫై చేస్తూ ఏపీ సర్కార్ ఆదేశాలు

రెండు రోజుల క్రితం ఏపీ సీఆర్డీఏ బిల్లును రద్దు చేస్తూ చేసిన చట్టం ఆమోదం పొందటంతో.. సీఆర్డీఏ స్థానంలో అమరావతి మెట్రోపాలిటీన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(AMRDA)ను నోటిఫై చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో సీఆర్డీఏ పరిధి అంతా ఇక నుంచి ఏఎంఆర్డీఏ పరిధిలోనికి వస్తుందని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీఆర్డీఏ రద్దు చట్టం 2020 అమల్లోకి వచ్చినందున 2014లో చేసిన సీఆర్డీఏ ఇక ఉనికిలో ఉండబోదని ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది.

ఇక‌ ఏఎంఆర్డీఏకు పురపాలక శాఖ కార్యదర్శి ఉపాధ్యక్షుడుగా.. 11 మంది అధికారులు సభ్యులుగా పాలక కమిటీ ఏర్పాటు అయ్యింది. కమిటీలో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఏఎంఆర్డీఏ కమిషనర్, గుంటూరు, కృష్ణా జిల్లా కలెక్టర్లు, డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్‌లు సభ్యులుగా ఉండనున్నారు. ఏఎంఆర్డీఏకు కమిషనర్‌గా లక్ష్మీ నరసింహంను నియమిస్తూ మరో ఉత్తర్వును ప్రభుత్వం జారీ చేసింది.

Next Story