ఏపీలో కొత్తగా 491 కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Jun 2020 12:19 PM GMT
ఏపీలో కొత్తగా 491 కేసులు

ఏపీలో శరవేగంగా కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో 200లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 22,371 సాంపిల్స్‌ని పరీక్షించగా.. కొత్తగా 491 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో తెలిపింది. వీటిలో రాష్ట్రానికి చెందిన వారు 390 మంది కాగా.. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 83 మంది.. 18 మంది విదేశాల నుంచి వచ్చినవారు ఉన్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8452కి చేరింది.

ఈ రోజు కొవిడ్‌ వల్ల కృష్ణలో ఇద్దరు, కర్నూల్‌లో ఇద్దరు, గుంటూరులో ఒక్కరు మొత్తం 5గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 101కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 4240 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 4111 మంది చికిత్స పొందుతున్నారు. ఈరోజు అనంతపురంలో అత్యధికంగా 97 కేసులు నమోదు కాగా.. చిత్తూరులో 51, ఈస్ట్‌ గోదావరిలో 41, గుంటూరులో 17, కడపలో 15, కృష్ణలో 51, కర్నూలులో 15, నెల్లూరులో 6, ప్రకాశంలో 16, విశాఖపట్నంలో 15, విజయనగరంలో 1, పశ్చిమ గోదావరిలో 65 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.

AP corona cases rise to 8452

Next Story