ఏపీలో మరో 147 పాజిటివ్ కేసులు
By తోట వంశీ కుమార్ Published on 9 Jun 2020 6:25 PM ISTఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 15,085 సాంపిల్స్ ను పరీక్షించగా.. కొత్తగా మరో 147 పాజిటివ్ కేసులు నిర్థారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3990కి చేరింది. గడిచిన 24గంటల్లో కరోనా వల్ల ఇద్దరు మృతి చెందారు. దీంతో ఈ మహమ్మారి వల్ల చనిపోయిన వారి సంఖ్య 77కి చేరింది.
మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 2403 మంది డిశ్చార్జి కాగా.. 1510మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక విదేశాల నుంచి ఏపీకి వచ్చిన వారిలో 132 మందికి కరోనా సోకగా.. 114 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చిన వారిలో 907 మంది కరోనా బారినపడగా.. 553 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Also Read
ఏపీలో షూటింగ్లకు అనుమతిNext Story