కర్ఫ్యూ లాంటి పరిస్థితులు సృష్టించారు.. ఎందుకు.? : వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిగజారిన లాండ్‌ ఆర్డర్‌, పాలన వైఫల్యాలు, మోసాల మధ్య చంద్రబాబు పాలన కొనసాగుతోందని వైఎస్ జగన్ విమర్శించారు.

By Medi Samrat
Published on : 19 Jun 2025 2:59 PM IST

కర్ఫ్యూ లాంటి పరిస్థితులు సృష్టించారు.. ఎందుకు.? : వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిగజారిన లాండ్‌ ఆర్డర్‌, పాలన వైఫల్యాలు, మోసాల మధ్య చంద్రబాబు పాలన కొనసాగుతోందని వైఎస్ జగన్ విమర్శించారు. టీడీపీ నేతలు, పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు రెంటపాళ్ల వెళ్ళినప్పుడు కర్ఫ్యూలాంటి పరిస్థితులు ఉన్నాయని.. సొంత పార్టీ శ్రేణుల్ని పరామర్శిస్తే తప్పా అని ప్రశ్నించారు. మొన్నటి పొదిలి పర్యటనలో 40వేల మందిపై రాళ్లేసే ప్రయత్నం చేశారని, రైతులు సంయమనం పాటించారన్నారు. చంద్రబాబు అహంకారంతో మాట్లాడుతూ ఉన్నారని, ప్రతిపక్షాలను భూస్థాపితం చేస్తారంటున్నారన్నారు. ఈ పాలనపై ప్రజల్లో ఉన్న అసహనాన్ని డైవర్ట్‌ చేస్తూ వైసీపీ సానుభూతిపరులపై, నేతలపై కేసులు పెడుతున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు.

మద్యం కేసులో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయన్నారు జగన్. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారు. ‌తప్పుడు స్టేట్‌మెంట్‌ ఇవ్వాలని గన్‌మెన్‌ను బలవంతం చేశారన్నారు. తప్పుడు స్టేట్‌మెంట్‌ ఇవ్వనందుకు గన్‌మెన్‌పై దాడి కూడా చేశారు. ఈ దాడి గురించి ప్రస్తావిస్తూ రాష్ట్రపతి, గవర్నర్‌, డీజీపీకి గన్‌మెన్‌ లేఖ రాశారన్నారు.

Next Story