తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ పీఏసీ సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయులును అరెస్ట్ చేయడం కూటమి కక్ష రాజకీయాలకు పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి సారి ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నానని, ఒక వ్యక్తిని ఇరికించడానికి కేసులు క్రియేట్ చేస్తున్నారని ఆరోపించారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారని, రాష్ట్రం ఎటువైపు వెళ్తుందో అర్థం కావడం లేదన్నారు. ఎలాగైనా ఎంపీ మిథున్రెడ్డిని ఇరికించాలని చూస్తున్నారన్నారు. కాలేజీ రోజుల్లో చంద్రబాబును పెద్దిరెడ్డి ఎదురించారు. కాబట్టే పెద్దిరెడ్డి కుటుంబంపై చంద్రబాబు కక్ష పెంచుకున్నారు.
విశాఖలో రూ.3వేల కోట్ల భూమిని ఊరు పేరులేని కంపెనీకి రూపాయికే కట్టబెట్టారని, లులూ గ్రూపునకు రూ.1500-2000 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టారు. రాజధానిలో నిర్మాణపు పనుల అంచనాలను విపరీతంగా పెంచి దోచేస్తున్నారని విమర్శించారు వైఎస్ జగన్. అప్పటి రేట్లతో పోలిస్తే సిమెంటు, స్టీల్ రేట్లు పెరిగాయి. రూ.36వేల కోట్ల పనులను ఇప్పుడు రూ.77 వేలకు పెంచారన్నారు. ఇంత దోపిడీని గతంలో ఎప్పుడూ చూడలేదని తెలిపారు.