ఆ పదవి వైసీపీ కైవసం

వైఎస్సార్‌ కడప జిల్లా జడ్పీ ఛైర్మన్‌ పదవి వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది.

By Medi Samrat
Published on : 27 March 2025 8:15 PM IST

ఆ పదవి వైసీపీ కైవసం

వైఎస్సార్‌ కడప జిల్లా జడ్పీ ఛైర్మన్‌ పదవి వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. వైఎస్సార్‌ జిల్లా పరిషత్ చైర్మన్‌గా వైఎస్సార్సీపీ జడ్పీటీసీ రామగోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారి ప్రకటించగా రామగోవిందరెడ్డి జడ్పీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.

బ్రహ్మంగారిమఠం మండల జెడ్పీటీసీ సభ్యుడు ముత్యాల రామగోవిందురెడ్డిని వైఎస్సార్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థిగా ప్రకటించింది. రెండు పర్యాయాలుగా బి.మఠం జెడ్పీటీసీగా ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశమై రామగోవిందురెడ్డి అభ్యర్థిత్వాన్ని ఎంపిక చేశారు.

Next Story