AndhraPradesh: పవన్‌ కల్యాణ్‌తో పాటు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు వీరే

చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నాలుగోవ సారి ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఆయన మంత్రివర్గ సహచరులు 24 మంది ప్రమాణం చేశారు.

By అంజి  Published on  12 Jun 2024 7:31 AM GMT
ministers, CM Chandrababu,AndhraPradesh, Pawankalyan

AndhraPradesh: పవన్‌ కల్యాణ్‌తో పాటు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు వీరే

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 164 స్థానాల గెలుపుతో ప్రభంజనం సృష్టించిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి... వైసీపీని 11 సీట్లకే పరిమితం చేసింది. ఇవాళ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నాలుగోవ సారి ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఆయన మంత్రివర్గ సహచరులు 24 మంది ప్రమాణం చేశారు. మంత్రుల చేత గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణస్వీకారం చేయించారు.

తెలుగు దేశం పార్టీ నుంచి నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పొంగూరి నారాయణ, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, గుమ్మిడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్.సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.

జనసేన నుంచి పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. కాగా ఈ కేబినెట్‌లో 17 మంది కొత్తవారే ఉన్నారు. అందులో ముగ్గురు మహిళలు. 8 మంది బీసీలు, ఇద్దరు ఎస్సీలు, ఒక ఎస్టీ, ఒక వైశ్య సామాజికవర్గ నేతకు క్యాబినెట్ లో అవకాశం కల్పించారు.

మంత్రుల జాబితాలో వెనుకబడిన తరగతుల నుంచి ఎనిమిది మంది, షెడ్యూల్డ్ కులాల నుంచి ముగ్గురు, షెడ్యూల్డ్ తెగల నుంచి ఒకరు ఉన్నారు. కమ్మ, కాపు సామాజిక వర్గాలకు చెందిన నలుగురు చొప్పున మంత్రులను నాయుడు చేర్చుకున్నారు. రెడ్డి వర్గానికి చెందిన ముగ్గురు, వైశ్య వర్గాలకు చెందిన ఒకరికి మంత్రివర్గంలో చోటు దక్కింది. నాయుడు సామాజికంగా, రాజకీయంగా శక్తివంతమైన కమ్మ సామాజికవర్గానికి చెందినవారు కాగా, పవన్ కళ్యాణ్ కాపు సామాజికవర్గం నుండి వచ్చారు.

గత నెలలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి భారీ ఆధిక్యంతో వైఎస్సార్‌సీపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకుంది. 175 స్థానాలున్న అసెంబ్లీలో 164 స్థానాలను కైవసం చేసుకుంది. టీడీపీ ఒంటరిగా 135 సీట్లు గెలుచుకోగా, జనసేన పార్టీ పోటీ చేసిన మొత్తం 21 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ పోటీ చేసిన 10 స్థానాలకు గానూ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది. గత అసెంబ్లీలో 151 మంది సభ్యులున్న వైఎస్సార్‌సీపీ కేవలం 11కి పడిపోయింది.

Next Story