ల్యాప్‌టాప్ పేలి గాయపడిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి..

Techie injured in laptop explosion dies in Kadapa district. వైఎస్ఆర్ కడప జిల్లా బి.కోడూరు మండలం మేకవారి గ్రామంలో ల్యాప్ టాప్ పేలి సాఫ్ట్ వేర్ ఇంజనీర్

By Medi Samrat  Published on  22 April 2022 2:31 PM GMT
ల్యాప్‌టాప్ పేలి గాయపడిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి..

వైఎస్ఆర్ కడప జిల్లా బి.కోడూరు మండలం మేకవారి గ్రామంలో ల్యాప్ టాప్ పేలి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సుమలత (22) తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సుమలత శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. సుమలత సోమవారం ఉదయం వ‌ర్క్ ఫ్రం హోంలో ఉండ‌గా షార్ట్ సర్క్యూట్ కారణంగా ల్యాప్‌టాప్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంచంపై కూర్చుని పని చేస్తున్న సుమలత విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితికి చేరుకుంది. మంచానికి కూడా మంటలు అంటుకున్నాయి. గదిలో నుంచి పొగలు రావడంతో కుటుంబ సభ్యులు గ‌మ‌నించి సుమలతను చికిత్స నిమిత్తం కడప సన్‌రైజ్‌ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆమెను రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. దాదాపు 80 శాతం కాలిన గాయాలతో యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సుమలత బెంగళూరులోని మ్యాజిక్ టెక్ సొల్యూషన్‌లో పనిచేస్తున్నారు.

Next Story