శుభ‌కార్యానికి వెళ్తుండ‌గా ట్రాక్టర్ బోల్తా.. ఎనిమిది మందికి గాయాలు..

Six of a family injured as a tractor overturns in Chintalapudi of Eluru. ఏలూరు జిల్లా చింతలపూడిలో దైవ దర్శనానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది

By Medi Samrat  Published on  24 April 2022 11:25 AM GMT
శుభ‌కార్యానికి వెళ్తుండ‌గా ట్రాక్టర్ బోల్తా.. ఎనిమిది మందికి గాయాలు..

ఏలూరు జిల్లా చింతలపూడిలో దైవ దర్శనానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్ర‌మాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతలపూడి మండలం బాలవారిగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన కుమారుడి అన్నప్రాసన కార్యక్రమానికి 20 మంది బంధువులతో కలిసి ట్రాక్టర్‌పై ఎన్టీఆర్‌ జిల్లా పుట్రేలి గ్రామంలోని మారెమ్మ ఆలయానికి బయలుదేరారు.

అయితే.. తాళ్లర్లపల్లి సమీపంలోకి రాగానే ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.



Next Story