జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు

People are happy with YSRCP governance. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు సంపూర్ణ మద్దతు తెలిపారని

By Medi Samrat
Published on : 13 Aug 2022 2:48 PM IST

జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు సంపూర్ణ మద్దతు తెలిపారని ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో స్పష్టంగా తేలిందని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు శనివారం తెలిపారు. ఆగస్టు 11న ఇండియా టుడే నిర్వహించిన మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ (మోట్‌ఎన్‌) సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించాలంటే వైఎస్‌ఆర్‌సీపీ ఘన విజయం సాధిస్తుంది. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజానాయకుడని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం పనిచేస్తారని అన్నారు.

రాష్ట్రంలో అధికార వైసీపీ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా.. ఇతర దేశాల నుంచి కూడా ప్రజాప్రతినిధులు ఏపీకి వచ్చి రాష్ట్ర అభివృద్ధిని చూసి వెళ్తున్నార‌ని తెలిపారు. ఇది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉన్న పరిపాలనా శక్తిని స్పష్టంగా తెలియజేస్తోంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనపై అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు.




Next Story