గుంటూరు పోలీసుల నుంచి నోటీసులు అందుకున్న పవన్ కళ్యాణ్

రాష్ట్రంలోని వాలంటీర్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలపై నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై గుంటూరు జిల్లా కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేసింది.

By Medi Samrat  Published on  18 Feb 2024 1:00 PM GMT
గుంటూరు పోలీసుల నుంచి నోటీసులు అందుకున్న పవన్ కళ్యాణ్

రాష్ట్రంలోని వాలంటీర్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలపై నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై గుంటూరు జిల్లా కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేసింది. మార్చి 25న కోర్టుకు హాజరుకావాలని ఫిబ్రవరి 18 ఆదివారం నాడు పవన్ కళ్యాణ్‌కు నోటీసులు జారీ చేశారు. 9 జూలై, 2023న ఏలూరులో జరిగిన బహిరంగ ర్యాలీలో పవన్ కళ్యాణ్ గ్రామ, వార్డు వాలంటీర్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యల కారణంగా ఈ కేసు నమోదైంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై గుంటూరు జిల్లా కోర్టులో క్రిమినల్ కేసు పెట్టింది. ఐపీసీ సెక్షన్ 499, 500 కింద ఈ కేసు నమోదైంది. వాలంటీర్లు, ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా పవన్ మాట్లాడారని కేసులో ప్రభుత్వం తెలిపింది. ఈ కేసును పరిగణనలోకి తీసుకున్న గుంటూరు జిల్లా కోర్టు.. ఈనెల 25న విచారణకు రావాలని పవన్ కళ్యాణ్‌ని ఆదేశించింది. ఈ కేసును నాలుగో అడిషనల్ జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. వాలంటీర్లు ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి వస్తున్నారనీ, ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారని.. వాలంటీర్ల వల్ల ఇళ్లలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతోందనీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్.

Next Story