వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్‌కు లేదు.. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్

Minister Vellampalli Srinivas fires at Pawan Kalyan. జనసేన పార్టీ వార్షికోత్సవ సభ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ధ్వజమెత్తారు.

By అంజి
Published on : 15 March 2022 11:12 AM IST

వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్‌కు లేదు.. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్

జనసేన పార్టీ వార్షికోత్సవ సభ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. రాజకీయాల్లో పవన్‌ కల్యాణ్‌కు వ్యక్తిగత అజెండా లేదని, ప్యాకేజీ కోసం బహిరంగ సభలతో టీడీపీకి లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి వెల్లంపల్లి అన్నారు. ప్రభుత్వంపై మాట్లాడే హక్కు పవన్‌ కల్యాణ్‌కు లేదని, గత ఎనిమిదేళ్లుగా అధికారం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా వైఎస్‌ జగన్‌పై విమర్శలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. జనసేన, పవన్ కల్యాణ్‌తో రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదని వెల్లంపల్లి శ్రీనివాస్‌ అభిప్రాయపడ్డారు.

బీజేపీ, సీపీఐ, సీపీఎంతో కలిసి 2024లో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేయాలన్నదే పవన్ కళ్యాణ్ ఆశయమని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. టీడీపీ హయాంలో గోదావరి పుష్కరాల సందర్భంగా 45 దేవాలయాలు కూల్చివేసి, 30 మంది చనిపోయినప్పుడు మౌనంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని గుర్తు చేశారు. రాజకీయ నాయకుడిగా మారిన నటుడికి రాజకీయాలపై అవగాహన లేదని, టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ రాసిన స్క్రిప్ట్‌ను ఇప్పుడే చదివానని మంత్రి పేర్కొంటూ ఆయనపై విమర్శలు గుప్పించారు. జనసేన పార్టీ తొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ ఈ సమావేశం నిర్వహించి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపై, ముఖ్యంగా వైఎస్‌ జగన్‌ విధానాలతో రాష్ట్రం వెనుకబడిపోయిందని ఆరోపించారు. 2024లో జనసేన పార్టీ అధికార వ్యతిరేక ఓట్లను చీల్చదని, వైఎస్సార్‌సీపీని ఓడిస్తుందని అన్నారు. రాజధాని అంశంపై మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే ఉంటుందని అన్నారు.

Next Story