అప్పుడు ఓకే చెప్పి, ఇప్పుడెందుకు వ్యతిరేకిస్తున్నారు..కేసీఆర్కు ఏపీ మంత్రి నిమ్మల కౌంటర్
బనకచర్ల ప్రాజెక్టు, వాస్తవాలు పేరుతో మంత్రి నిమ్మల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు
By Knakam Karthik
అప్పుడు ఓకే చెప్పి, ఇప్పుడెందుకు వ్యతిరేకిస్తున్నారు..కేసీఆర్కు ఏపీ మంత్రి నిమ్మల కౌంటర్
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు ప్రారంభించారు...అని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. బనకచర్ల ప్రాజెక్టు, వాస్తవాలు పేరుతో మంత్రి నిమ్మల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పోలవరం బనకచర్ల ప్రాజెక్టుపై ఆరోపణలు సాంకేతిక అంశాల కంటే రాజకీయ అంశాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ రాష్ట్రంలో ఉన్న అంతర్గత రాజకీయాల్లో భాగంగా పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ను వాడుకోవడం సరికాదు. పోలవరం బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం వలన ఎగువ రాష్ట్రాలకు నష్టం లేదు. ఏపీ దిగువ రాష్ట్రం. గోదావరి నుండి సముద్రంలోకి వృధా గా పోతున్న నీటినే వాడుకుంటాం. దీని వలన ఎవరికి నష్టం?. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కడుతున్నాం. గత 50 ఏళ్లుగా ప్రతి ఏడాది గోదావారి నుంచి 3000 టీఏంసీల నీరు సముద్రంలో వృధాగా కలుస్తుంది. గోదావరి నుండి పోలవరం ప్రాజెక్టు దాటితే సముద్రంలోనే కలిసేది. 1986 లో 36 లక్షల క్యూసెక్కుల వరద ఉధృతికి ఉభయ గోదావరి జిల్లాల్లో కోటి మంది జనాభా ముంపు బారిన పడింది. పోలవరం బనకచర్ల ప్రాజెక్టు కేవలం వరద నీరునే వాడుకుంటాం. దేశంలోనే రెండో అతి తక్కువ వర్ష పాతం ఉన్న అనంతపురం జిల్లాకు నీరు తరలిస్తాం..అని మంత్రి నిమ్మల పేర్కొన్నారు.
తెలుగు జాతి ప్రజలందరం ఆలోచించాలి. ఆంధ్ర ప్రాజెక్టులకు తప్ప తెలంగాణా కు వర్తించవా? తెలంగాణ ప్రాజెక్ట్ లను ఆపాలని చంద్రబాబుకి అప్పుడు లేదు ఇప్పుడు లేదు. GWTD క్లాజ్ 4 ప్రకారమే పోలవరం బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నాం. 2016 లో జరిగిన ఎపెక్స్ కౌన్సిల్ లో ఇరు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ ఇచ్చు పుచ్చుకునే ధోరణిలో తీసుకునే దానిలో కేసీఆర్ అంగీకరించారు. రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు కట్టుబడి ఉంటాను..అందుకు గోదావరి వరద జలాలే శరణ్యం అని..ఆనాడు కేసీఆర్ మాట్లాడిన వీడియోను ప్రజెంటేషన్లో మంత్రి మంత్రి రామానాయుడు ప్రదర్శించారు.
మనకు గోదావరి నీటిని శ్రీశైలం,నాగార్జున సాగర్ కు తరలించే దానికి కేసీఆర్ సహకరిస్తున్నారు. ఇది కేసీఆర్ ఔదార్యం అని ఏపీ అసెంబ్లీ లో మాజీ సీఎం జగన్ వీడియో ప్రదర్శించిన నిమ్మల. గతంలో ఎగువ ప్రాంతాల్లో నీరును వాడుకోవడానికి అంగీకరించిన కేసీఆర్ నేడు వ్యతిరేకించడం దారుణం. కె ఎల్ రావు ఆనాడే నదుల అనుసంధానం గూర్చి చెప్పారు. నేడు ప్రధాని నరేంద్ర మోడీ కూడా నదుల అను సంధానం ద్వారా దేశంలో కరువు నివారించవచ్చని భావిస్తున్నారు. అందుకే నదుల అనుసంధానం చేయాలని భావిస్తున్నారు. వరద జలాలను వదులుకునే పూర్తి హక్కు దిగువ రాష్ట్రం ఏపీకి ఉంది. రాయలసీమ కు గోదావరి వరద జలాలను తరలిస్తామని CWCకి కూడా చెప్పాం. రాయలసీమ బిడ్డ అంటున్న జగన్ ఎందుకు నోరు విప్పరు? జగన్ , కేసిఆర్ ఇద్దరు కలిసి చేసుకున్న ఒప్పందం. ఇప్పుడు బీఆర్ఎస్ ఎందుకు వ్యతిరేకిస్తుంది. అధికారంలో ఉంటే ఒకలాగా...ప్రతి పక్షం లో ఉంటే మరోలా జగన్, కేసీఆర్ మాట్లాడుతున్నారు. అన్ని అనుమతులు తీసుకునే పోలవరం బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం చేపడతాం..అని .అని ఏపీ మంత్రి నిమ్మల వ్యాఖ్యానించారు.